E-Paper
Advertisement

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి, ఆ పార్టీల నుంచి ఎవరంటే

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి, ఆ పార్టీల నుంచి ఎవరంటే

Amaravati: ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం కొత్త మలుపు తిరుగుతుందా? ఖాళీ అయిన నాలుగు సీట్లలో టీడీపీ మూడు, జనసేన ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యాయా? గతంలో బీజేపీకి ఒకటి కేటాయించడంతో ఈసారి నాలుగు సీట్లు టీడీపీ-జనసేన పంచుకోనున్నాయా? ఈ సీట్ల కోసం ఇరు పార్టీల నుంచి అధిక సంఖ్యలో నేతలు పడుతున్నారు.

ఏపీలో రాజ్యసభ సీట్ల వ్యవహారం.. టీడీపీకి మూడు-జనసేనకు ఒకటి

రాజ్యసభ సీట్ల నామినేషన్లకు గడువు దగ్గరపడుతుండడంతో ఏపీలో రాజకీయ పార్టీలు అలర్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఏపీలో నాలుగు సీట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం సీఎం క్యాంపు కార్యాలయంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతల భేటీ జరిగింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్, ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు.

నేతలంతా దాదాపు వివిధ అంశాలపై గంట పాటు చర్చించారు. గతంలో బీజేపీకి ఒకటి కేటాయించింది కూటమి ప్రభుత్వం. ఈసారి సీట్లలో టీడీపీ మూడు, జనసేన ఒకటి తీసుకోవాలని డిసైడ్ అయ్యాయి. ఈ విషయాన్ని సూచనప్రాయంగా ఏపీ టీడీపీ చీఫ్ పల్లా శ్రీనివాసరావు చెప్పుకొచ్చారు.

జనసేన నుంచి లింగమనేని.. టీడీపీ నుంచి అరడజను మంది రేసులో

2024–29 మధ్య రాజ్యసభ స్థానాల్లో జనసేనకు మూడు ఇచ్చేలా మొదట్లో కూటమి నేతల మధ్య చర్చ జరిగింది. దాని ప్రకారం జనసేనకు ఈ దఫాలో ఒకటి కేటాయించింది. ఈ విషయాన్ని జనసేన పార్టీ ఎక్స్ వేదికగా తెలిపింది. అప్పటి ఎన్నికల సమయంలో సర్దుబాటుల్లో భాగంగా జనసేన తాను పోటీ చేయవలసిన లోక్‌సభ స్థానాలను త్యాగం చేసింది.

ఆ క్రమంలో రాజ్య సభలో స్థానాలు కల్పించేలా చర్చ జరిగింది. ఇందులో భాగంగానే ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చే రాజ్యసభ స్థానాలలో మూడు జనసేనకు కేటాయించేలా నిర్ణయించారు. ఈ దఫా ఎన్నికల్లో జనసేనకు ఒకటి దక్కింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ సన్నిహితుడైన లింగమనేని రమేష్‌ పేరు బలంగా వినిపిస్తోంది.  తొలుత నాగబాబుకు ఈ సీటు ఇవ్వాలని భావించారు. ఎమ్మెల్సీ సీటు ఆయనకు కేటాయించిన విషయం తెల్సిందే.

ALSO READ: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

టీడీపీ నుంచి స్పీకర్ అయ్యన్న  కొడుకు, మరో సీనియర్ యనమల, మరో నలుగురు రేసులో ఉన్నారు. ఓ పారిశ్రామికవేత్త ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వారిలో పారిశ్రామిక వేత్త రామకృష్ణ, గల్లా జయదేవ్, రెడెప్పగారి శ్రీనివాసరెడ్డి, సానా సతీష్, కంభంపాటి రామ్మోహనరావుల పేర్లు బలంగా వినిపిస్తున్నాయి.  ఈ సీట్లకు సంబంధించి నేడు లేకుంటే రేపు గానీ ప్రకటన రావచ్చని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

Big Stories

×