E-Paper
Advertisement

Miryalaguda: మిర్యాలగూడలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు, ముగ్గురు సజీవ దహనం

Miryalaguda: మిర్యాలగూడలో ఘోరం..  గ్యాస్ సిలిండర్ పేలుడులో కొత్త విషయాలు,  ముగ్గురు సజీవ దహనం

Miryalaguda: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని కలలవాడ కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు సజీవ దహనమయ్యారు. స్థానికంగా తీవ్ర కలకలం రేపిన ఈ ఘటనలో అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.

మిర్యాలగూడలో ఘోరం.. గ్యాస్ సిలిండర్ పేలుడు

ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు ఏర్పడ్డాయి. అవి వేగంగా వ్యాపించడంతో ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి పోయింది. ఆ సమయంలో ఇంటి కుటుంబసభ్యులంతా మంటల్లో చిక్కుకున్నారు. ఈ ప్రమాదంలో 46 ఏళ్ల చంద్రమ్మ, మనవడు, మనవరాలు మంటల్లో చిక్కుకుని సజీవ దహనమయ్యారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగాయి. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి‌కి తరలించారు పోలీసులు.

ఇంట్లోని ముగ్గురు సజీవ దహనం.. ఆ ఫ్యామిలీ కష్టాలు అన్నీ ఇన్నీకావు

చంద్రమ్మ భర్త పక్షవాతంతో పదేళ్లుగా మంచానికే పరిమితం అయ్యాడు. పెద్ద కూతురు వివాహం తర్వాత అల్లుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఇద్దరు చిన్న పిల్లలు, కూతురు కలిసి జీవనం సాగిస్తున్నారు. అదే సమయంలో ఆ ఫ్యామిలీపై విధి కన్నెర్ర చేసింది.

చంద్రమ్మ భర్త మరణించి నెల రోజులు గడవకుండానే ఆ ఇంట్లో మరో పెను విషాదం చోటుచేసుకుంది. గ్యాస్ సిలిండర్ ఘటనలో అమ్మమ్మతోపాటు మనవడు, మనమరాలు ఈలోకాన్ని విడిచిపెట్టారు. చివరకు చంద్రమ్మ కూతురు ఉన్నారు. తల్లి, పిల్లల మృతదేహాలను చూసి ఆమె కన్నీరు మున్నీరు అయ్యారు. ఆమెని ఓదార్చడం ఎవరివారి వల్ల కాలేదు.

ALSO READ: రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, కేటీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో?

 

Related News

రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్ స్కామ్.. తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు, హిస్టోరీకల్ డే అంటూ కేటీఆర్ ట్వీట్

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో ఎబోలా వైరస్ అలర్ట్..!

పాలమూరు రైతులకు గుడ్ న్యూస్.. కృష్ణా జలాలపై సీఎం కీలక ప్రకటన

ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక గ్రామసభల్లోనే.. క్లారిటీ ఇచ్చిన అధికారులు

భవన అనుమతుల సర్టిఫికెట్లకు మోక్షం ఎప్పుడో.. ఇంకా ఎదురుచూపులేనా..?

సీఎస్ అంశంపై మళ్లీ కేంద్రానికి లేఖ రాయనున్న సీఎం రేవంత్..?

అంగన్వాడీలకు గుడ్ న్యూస్ చెప్పనున్న ప్రభుత్వం..!

Big Stories

×