E-Paper
Advertisement

Rape Attempt : కంది చేనులో మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడి కోసం పోలీసుల తిప్పలు

Rape Attempt : కంది చేనులో మహిళపై అత్యాచారయత్నం.. నిందితుడి కోసం పోలీసుల తిప్పలు
Advertisement

Rape Attempt : పొద్దున్నే మొక్కజొన్న పొలానికి పిట్టల కావలికి వెళ్లిన ఓ మహిళపై దుండగుడు అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణ శివార్లలో చోటుచేసుకుంది. ఆత్మకూరు పట్టణానికి చెందిన ఒక మహిళ తమ మొక్కజొన్న పంట వద్దకు వెళ్లింది. పని పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా అక్కడే కంది చేనులో మాటు వేసిన ఓ దుండగుడు ఆమెపై అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. కేకలు వేస్తున్నా వదలకుండా వేధించాడు. ఆమె అతన్ని తోసేసి పరుగులు తీసింది. అయితే అదే సమయంలో మహిళ బంధువులు రావడంతో దుండగుడు అక్కడి నుంచి పరారయ్యాడు.

బాధిత మహిళ కుటుంబీకులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆత్మకూరు సీఐ నాగభూషణ్, ఎస్సైలు జి. కృష్ణమూర్తి, వెంకటనారాయణ రెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే దుండగుడు సమీపంలోని 15 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన మొక్కజొన్న తోటలోకి వెళ్లి దాక్కున్నాడు. ఆరు అడుగుల ఎత్తులో మొక్కజొన్న పైరు పెరగడంతో నిందితుడికి పట్టుకోవడం పోలీసులకు సమస్యగా మారింది. దీంతో వారు వెంటనే రెండు డ్రోన్ కెమెరాలను తెప్పించి నిందితుడి కోసం గాలింపు చేపట్టినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

Advertisement

ఆయినప్పటికీ పోలీసులు పొలం చుట్టూ చేరి అక్కడే మకాం చేశారు. దీంతో ఎట్టకేలకు సాయంత్రం నిందితుడు మొక్కజొన్న చేనులో నుంచి బయటకు రావడంతో పోలీసులు అదుపులోకి తిసుకున్నారు. మొక్కజొన్న చేనులోకి వెళ్లిన నిందితుడు అప్పటికే మద్యం సేవించడంతో సాయంత్రం వరకు తోటలోనే నిద్రించినట్లు తెలిసింది. పట్టుబడిన నిందితుడు ఆత్మకూరు మండలం కరివేన గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. గతంలో కూడా ఇతను ఇదేవిధంగా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

Related News

ఇంకా దాగుడు మూతలు ఎందుకు.. చంద్రబాబు, నారా లోకేష్ పై నిప్పులు చెరిగిన జగన్!

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

Big Stories

Advertisement
×