E-Paper
Advertisement

Markapuram Accident: ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 20 మంది సజీవ దహనం, మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం

Markapuram Accident: ప్రమాదానికి గురైన ట్రావెల్ బస్సు.. 20 మంది సజీవ దహనం, మార్కాపురం జిల్లాలో ఘోర ప్రమాదం
Advertisement

Markapuram Accident: మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలకల క్వారీల వద్ద టిప్పర్ ను ప్రైవేటు ట్రావెల్ బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్ధమైంది. స్పాట్ లో 20 మంది సజీవదహనమయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది?

మర్కాపురం జిల్లాలో ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం 

Advertisement

ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో గురువారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్వారీల వద్ద ట్రావెల్స్ బస్సు.. ఎదురుగా వస్తున్న టిప్పర్‌ను ఢీ కొట్టింది. వెంటనే మంటలు బస్సుని చుట్టుముట్టాయి. అప్పటికి ప్రయాణికులు నిద్రలో ఉన్నారు.

ప్రయాణికులు తేరుకునే లోపు 20 మంది సజీవ దహనమయ్యారు. అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.హైదరాబాద్ నుండి ప్రకాశం జిల్లా పామూరు ట్రావెల్ బస్సు వెళ్తోంది. ఘటన సమయంలో బస్సులో దాదాపు 40 మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన గురించి సమాచారం అందుకున్నారు పోలీసులు. మరో 23 మంది గాయపడ్డారు.

Advertisement

టిప్పర్‌ని ఢీ కొన్న ట్రావెల్ బస్సు.. 10 మంది ప్రయాణికులు సజీవ దహనం

వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. ఈలోగా సమీపంలోని స్థానికులు అక్కడికి చేరుకున్నారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి వుంది. గురువారం ఉదయం 6 నుంచి 6.30 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. నిర్మల్ నుంచి నెల్లూరు జిల్లా ఉదయగిరికి వెళ్తోంది ఈ ట్రావెల్ బస్సు.

ప్రమాదంలో బస్సు పూర్తిగా దహనం కావడంతో ఏ ట్రావెల్‌కి చెందినది అనేది స్పష్టత రాలేదు. ప్రమాదానికి ముందు మార్కాపురంలో కొంతమంది ప్రయాణికులు దిగిపోయారు. మార్కాపురం దాటిన బస్సు మూడు కిలోమీటర్లు వెళ్లగానే ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదం సమయంలో బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 10 మంది ప్రయాణికులు బయటపడ్డారని సమాచారం. లోపల 10 నుంచి 20 మంది ప్రయాణికులు ఉండవచ్చని ఓ అంచనా. మృతుల్లో పిల్లలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

Big Stories

Advertisement
×