Visakhapatnam: బస్సు స్టేషన్లు, రైల్వేస్టేషన్లు దొంగలకు కేరాఫ్గా ఉండేవి. దొంగలను పట్టుకునేందుకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికీ భారీగా పోలీసులు మొహరిస్తుంటారు. ఇకపై పోలీసులకు ఆ శ్రమ అక్కర్లేదు. రోబో ఏఎస్సీ అర్జున్కు అప్పగిస్తే చాలు, ఆ పని మరింత సులువుగా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరు క్రిమినల్స్ను పట్టించింది. అదెలా సాధ్యమని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం.
విశాఖ రైల్వేస్టేషన్లో నేరగాళ్ల కోసం రోబో అర్జున్ వేట
రోబోలు ఒక్కో వ్యవస్థలోని క్రమంగా ఎంట్రీ ఇస్తున్నాయి. మనుషులుండే ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇప్పుడు రోబోలు ఎంట్రీ ఇచ్చేస్తున్నాయి. రీసెంట్గా విశాఖ రైల్వేస్టేషన్లో రోబో ‘ఏఎస్సీ అర్జున్’ ఇంట్రీ ఇచ్చింది. రాత్రి ఇద్దరు దొంగలను పట్టించింది. వినడానికి విచిత్రంగా ఉన్నా, ముమ్మాటికీ నిజం.
విశాఖపట్నం రైల్వేస్టేషన్లో హ్యూమనాయిడ్ రోబో అనబడే ఏఎస్సీ అర్జున్ చూసి నేరస్తులు బెంబేలెత్తిపోతున్నారు. అర్జున్కి కనిపించకుండా ఉండేందుకు తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి 8 గంటల సమయంలో స్టేషన్లో విధులు నిర్వహిస్తోంది రోబో. నేరస్థుల వివరాలు పోలీసులు అధికారలు అప్లోడ్ చేసి ఉండడంతో స్టేషన్కు వచ్చిన వారిపై ఓ కన్నేసింది.
రోబో సమాచారం.. ఇద్దరు అరెస్ట్
ప్రతి ఒక్కరి ఫొటోలు తీసి తన వద్దనున్న డేటాతో పోల్చి చూస్తోంది. అది ఓకే అయితే పోలీసులకు అలర్ట్ సమాచారం ఇస్తుంది. సరిగ్గా అలాగే చేసిన రోబో అర్జున్, ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ ద్వారా ఇద్దరు పాత నేరస్థులను గుర్తించింది. సీసీటీవీ ఫుటేజీ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చింది. రంగంలోకి దిగిన పోలీసులు.. రోబో చెప్పిన ఇద్దర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ప్రయాణ టికెట్ లేదని గుర్తించారు.
పట్టుబడిన పాత నేరస్థులు శివ, బంగారుగా గుర్తించారు పోలీసులు. వారిపై రాయగడ పోలీస్స్టేషన్లో అనేక కేసులు ఉన్నట్టు తేలింది. దీంతో రాయగడ పోలీసులకు సమాచారం ఇచ్చారు రైల్వే పోలీసులు. పాత నేరస్థుల్ని గుర్తించడంలో ఏఐ ఆధారిత రోబో సేవలు బాగున్నాయని రైల్వే డీఆర్ఎం లలిత్ బోహ్ర చెప్పారు. భవిష్యత్తులో నేరాలు నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
ALSO READ: కమిటీకి ఆధారాలు.. త్వరలో అన్ని నిజాలు బయట పెడతానన్న అరవ శ్రీధర్
విశాఖ స్టేషన్లో పట్టుబడిన ఇద్దరు నేరస్థులు రాయగడలో భారీ దొంగతనాలు, దోపిడీలు, దాడులు, ఆయుధ సంబంధిత నేరాలు వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడినట్టు తేలింది. పట్టుబడిన ఇద్దరు నేరస్థులు టిక్కెట్లు లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించడంతో వారిపై భారతీయ రైల్వే చట్టం ప్రకారం చర్యలు మొదలుపెట్టారు.
ఇద్దరు నేరస్తులను పట్టించిన రోబో
విశాఖ రైల్వేస్టేషన్లో తిరుగుతున్న ఇద్దరు నేరస్తులను డేటాబేస్లోని చిత్రాలతో పోల్చి RPF పోలీసులకు అలర్ట్
రోబో సాయంతో నేరస్తులను పట్టుకున్న పోలీసులు
రాయగడ పోలీస్ స్టేషన్లో ఇద్దరు నేరస్తులపై పలు కేసులు
Robot catches Two criminals roaming in… pic.twitter.com/OQLuFfmW3s
— BIG TV Breaking News (@bigtvtelugu) February 4, 2026