E-Paper
Advertisement

Sai Dharam Tej: అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా.. రియల్ హీరో సాయిధరమ్ తేజ్..

Sai Dharam Tej: అభిమాని మృతి.. టీజర్‌ వాయిదా.. రియల్ హీరో సాయిధరమ్ తేజ్..
Advertisement

Sai Dharam Tej: మెగా హీరో సాయిధరమ్ తేజ్. యాక్సిడెంట్ తర్వాత ఇంకా కొత్త సినిమా రాలేదు. చాలా గ్యాప్ రావడంతో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. తమ హీరో ఇప్పుడు ఎలా ఉన్నాడోనని.. తెరపై ఎప్పుడెప్పుడు చూస్తామా అని.. తెగ ఆరాటపడుతున్నారు. ఇలాంటి సమయంలో సాయిధరమ్ తేజ్ హీరోగా ‘విరూపాక్ష’ సిద్ధమవుతోంది. ఈ బుధవారమే టీజర్ రిలీజ్ కావాల్సి ఉండే. అంతా ఎగ్జైంటింగ్‌గా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ……..

‘విరూపాక్ష’ టీజర్ అటు తేజ్‌కు, ఇటు ఫ్యాన్స్‌కు వెరీవెరీ ఇంపార్టెంట్. అయితేనేం.. తనకు తన సినిమాకంటే కూడా అభిమానే ఎక్కువని నిరూపించుకున్నారు సాయిధరమ్ తేజ్. మెగా హీరో అనిపించుకున్నారు. తన మంచితనాన్ని మరోసారి చాటుకున్నారు. ‘విరూపాక్ష’ టీజర్‌ను వాయిదా వేసుకున్నారు. ఎందుకంటే? అసలేం జరిగిందంటే..?

Advertisement

హీరో సాయిధరమ్‌ తేజ్‌ భీమవరం అభిమాన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్న రావూరి పండు (28) అకస్మాత్తుగా చనిపోయాడు. మంగళవారం క్రికెట్‌ ఆడుతూ.. గుండెపోటు రావడంతో మృతి చెందాడు. పండు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు సాయిధరమ్ తేజ్. అభిమాని చనిపోయిన విషాధంలో తన సినిమా టీజర్‌ను రిలీజ్ చేయలేనంటూ.. ‘విరూపాక్ష’ టీజర్‌ను వాయిదా వేసుకున్నారు. కొత్త అప్‌డేట్‌ను త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించారు.

‘రిపబ్లిక్‌’ తర్వాత సాయి ధరమ్‌ తేజ్‌ నటిస్తోన్న మూవీ ‘విరూపాక్ష’. కార్తిక్‌ దండు డైరెక్టర్. సంయుక్త హీరోయిన్. దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే అందించారు. మంగళవారం సాయంత్రమే టీజర్‌ను పవన్‌కల్యాణ్‌ చూసి చిత్రబృందాన్ని మెచ్చుకున్నారు. బుధవారం టీజర్ రిలీజ్ ఉండగా.. అభిమాని పండు మృతితో వాయిదా పడింది.

Tags

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×