E-Paper
Advertisement

Cyber Crime: ఫేస్‌బుక్ ఎంత పని చేసింది భయ్యా.. అక్షరాల రూ.20 లక్షలు గోవిందా..!

Cyber Crime: ఫేస్‌బుక్ ఎంత పని చేసింది భయ్యా.. అక్షరాల రూ.20 లక్షలు గోవిందా..!
Advertisement

పల్నాడు జిల్లాలోని సత్తెనపల్లికి చెందిన ఓ బంగారం వ్యాపారిని లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి పాల్పడ్డారు. వ్యాపారికి ‘రుచి’ అనే పేరుతో ఫేస్‌బుక్‌లో వచ్చిన ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను అంగీకరించడంతో ఈ వ్యవహారం మొదలైంది. గుర్తు తెలియని ఆ యువతి కొన్ని రోజులు వ్యాపారితో ఛాటింగ్ చేస్తూ పరిచయాన్ని పెంచుకుంది.

చాటింగ్ ద్వారా నమ్మకాన్ని చూరగొన్న తర్వాత, ఆ యువతి వ్యాపారిని మోసగించేందుకు పన్నాగం రచించింది. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకే బంగారం, వెండిని పంపిస్తానని నమ్మబలికింది. ఆమె మాటలను పూర్తిగా నమ్మిన ఆ బంగారం వ్యాపారి, ఆమె చెప్పిన అకౌంట్‌కు దఫదఫాలుగా మొత్తం రూ. 20 లక్షలు పంపించాడు.

Advertisement

అయితే, డబ్బు పంపిన తర్వాత చాలా రోజులైనా సరుకు రాకపోవడంతో అనుమానం వచ్చిన వ్యాపారి ఆమెకు ఫోన్ చేశాడు. ఆమె నుంచి ఎటువంటి స్పందనా లభించకపోవడంతో, తాను మోసపోయానని గ్రహించి ఆలస్యంగా పోలీసులను ఆశ్రయించాడు. వ్యాపారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, సైబర్ నేరగాళ్లపై దర్యాప్తు ప్రారంభించారు.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×