E-Paper
Advertisement

Visakhapatnam: విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్.. సభకు అనుమతులు నిరాకరణ, ఏం జరిగింది?

Visakhapatnam: విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్.. సభకు అనుమతులు నిరాకరణ, ఏం జరిగింది?
Advertisement

Visakhapatnam: విశాఖ సిటీలో వైసీపీకి షాక్ ఇచ్చారు వీఎంఆర్డీఏ అధికారులు. ఉడా చిల్డ్రన్స్ ఏరియాలో బ్యానర్స్ కట్టి భారీ సభకు ఏర్పాటు చేశారు ఆ పార్టీ నేతలు. ఏం జరిగిందో తెలీదుగానీ, చివరకు పర్మీషన్ రద్దు చేశారు అధికారులు. దీంతో షాక్ కావడం వైసీపీ వంతైంది. దీని వెనుక అసలేం జరిగింది?

విశాఖలో వైసీపీకి అధికారులు ఝలక్

Advertisement

విశాఖ సిటీలోని ఉడా చిల్డ్రన్స్ ఎరీనాలో వైసీపీ సభకు అనుమతి ఇవ్వడం వివాదాస్పదంగా మారింది. సోమవారం చిల్డ్రన్స్ ఎరీనాలో  ఆ పార్టీలో  కార్యకర్తలు జాయినింగ్స్ కార్యక్రమం నిర్వహించేందుకు ఆ పార్టీ దరఖాస్తు చేసుకుంది. తొలుత వీఎంఆర్డీఏ అధికారులు అనుమతి ఇచ్చారు.

ఈ క్రమంలో ఉడా చిల్డ్రన్ పరిసరాల్లో భారీగా బ్యానర్లు, కటౌట్లు ఏర్పాటు చేసుకుంది ఆ పార్టీ. ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకునేందుకు వైసీపీ నుంచి రూ.71,300 ఫీజు కూడా కట్టించుకుంది. చిల్డ్రన్స్ ఎరినాలో పార్టీ కార్యక్రమం జరగడంపై పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీనిపై రెండు మూడురోజులుగా రచ్చ సాగుతోంది.

Advertisement

సభకు అనుమతులు నిరాకరణ

పరిస్థితి గమనించిన వీఎంఆర్డీ అధికారులు చివరకు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. తప్పు తెలుసుకున్న అధికారులు..సభకు అనుమతి లేదని వైసీపీ నేతలకు తేల్చి చెప్పారు. లోపలకు ఎవరినీ రాకుండా వీఎంఆర్డీఏ సిబ్బంది అడ్డుకున్నారు. ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు.

చేరిక సభ నేపథ్యంలో అప్పటికే వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అధికారులు లోపలికి అనుమతించకపోవడంతో గేటు వద్ద ఉండిపోయారు. ముందు రోజు ఆ పార్టీ ఫ్లెక్సీలు, బ్యానర్లు కట్టినప్పుడు అధికారులు ఏం చేశారంటూ మండిపడుతున్నారు. కావాలనే ఇలా చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఉన్నట్లుండి కార్యక్రమంగా అర్థాంతరంగా వాయిదా పడడంతో కొందరు నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ALSO READ: టీడీపీకి షాక్.. జగన్ కి సపోర్టుగా కొలికపూడి

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×