BigTV English

Slab Collapsed: ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు!

Slab Collapsed: ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు!
Advertisement

Slab Collapsed in Nandyal District(AP news today telugu): నంద్యాల జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రోదనలు మిన్నంటాయి. చాగలమర్రి మండలంలోని చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలడంతో నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


భార్యభర్తలు గురుశేఖర్ రెడ్డి(45), దస్తగిరమ్మ(38), ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10) రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలింది. ఉదయం స్థానికులు చూసే సరికి ఇల్లు కూలింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Also Read: జగన్ పరిస్థితి ఏంటి, వెంకట్‌రెడ్డి ఎక్కడ? రంగంలోకి ఏసీబీ..


శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులు వెలికితీశారు. అయితే వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నట్లు గ్రామస్తుల తెలిపారు. కుటుంబంలో ఒకేసారి నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా, ఇటీవల కురిసన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచి, శిథిలావస్థకు చేరి కూలినట్లు తెలుస్తోంది.

Related News

AP CM Chandrababu: చిరు వ్యాపారులను కలిసిన సీఎం చంద్రబాబు.. జీఎస్టీ సంస్కరణ ఫలితాలపై ఆరా

CM Progress Report: విశాఖలో గూగుల్ ఉద్యోగులకు దీపావళి కానుక

AP Heavy Rains: ఈ నెల 21నాటికి బంగాళాఖాతంలో అల్పపీడనం.. రానున్న నాలుగు రోజులు భారీ వర్షాలు

CM Chandrababu: దీపావళి వేళ మరో గుడ్‌న్యూస్ చెప్పిన.. ఏపీ సీఎం చంద్రబాబు

Jogi Ramesh: నన్ను జైలుకు పంపాలని టార్గెట్.. బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు

Target Pavan: టార్గెట్ పవన్.. జనసేనను బలహీన పరిచే కుట్ర..!

Nara Lokesh Australia Visit: ఏపీ క్లస్టర్‌లలో ఆస్ట్రేలియా పెట్టుబడుల కోసం.. మంత్రి లోకేష్ విజ్ఞప్తి

Digital Arrest Scam: ఎమ్మెల్యేకే బురిడీ..! రూ.1.07 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Big Stories

×