E-Paper
Advertisement

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం
Advertisement

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని గంగుడుపల్లెలో అర్ధరాత్రి హత్య కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు . దీంతో ఆ వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యాడు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజుగా గుర్తించారు. నాగరాజు తిరుపతి నుంచి బ్రాహ్మాణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో గోల్డ్ చైన్, చెప్పులను లభ్యం చేసుకున్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నాగరాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Advertisement

హత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Related News

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

Big Stories

Advertisement
×