BigTV English

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని గంగుడుపల్లెలో అర్ధరాత్రి హత్య కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు . దీంతో ఆ వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యాడు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజుగా గుర్తించారు. నాగరాజు తిరుపతి నుంచి బ్రాహ్మాణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో గోల్డ్ చైన్, చెప్పులను లభ్యం చేసుకున్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నాగరాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.


Related News

TTD Chairman BR Naidu: తిరుమల శ్రీవారి సేవకులకు.. టీటీడీ ఛైర్మన్ గుడ్‌న్యూస్

Nagababu – Anitha: ఎమ్మెల్సీగా నాగబాబు తొలి ప్రశ్న – మంత్రి అనిత సమాధానం

Lokesh Vs Botsa: నా తల్లిని అవమానించినప్పుడు మీరేంచేశారు.. మంత్రి లోకేశ్ భావోద్వేగం.. బొత్సపై అనిత ఫైర్

Durgamma Temple: ఇంద్రకీలాద్రి టెంపుల్‌లో అపచారం.. ముగ్గురు వ్యక్తులు చెప్పులను ధరించి టెంపుల్‌లోకి..?

AP Rains: ఏపీ వాసులకు అలర్ట్.. రాగల 3 గంటల్లో పిడుగుపాటు హెచ్చరిక.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

GST Official Suspended: సోషల్ మీడియా పోస్ట్ తో ఉద్యోగం ఊడింది.. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ పై సస్పెన్షన్ వేటు

Prakasam District: గిద్దలూరులో విషాదం.. బాత్రూంలో డెలివరీ.. బకెట్లో శిశువును పడేసి.. పరారైన తల్లి

Tirumala: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం

Big Stories

×