BigTV English
Advertisement

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Tirupati: కారుపై పెట్రోల్ పోసి నిప్పు.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సజీవ దహనం

Tirupati: తిరుపతి జిల్లా చంద్రగిరి పరిధిలోని గంగుడుపల్లెలో అర్ధరాత్రి హత్య కలకలం రేపుతోంది. ఓ వ్యక్తిని కారులో కట్టేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు . దీంతో ఆ వ్యక్తి మంటల్లో సజీవదహనమయ్యాడు. మృతుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగరాజుగా గుర్తించారు. నాగరాజు తిరుపతి నుంచి బ్రాహ్మాణపల్లికి వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.


స్థానికుల సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనాస్థలిలో గోల్డ్ చైన్, చెప్పులను లభ్యం చేసుకున్నారు. నాగరాజు కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. నాగరాజు మరణవార్త విని కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మృతుడు నాగరాజుకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

హత్య కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆగంతకుల కోసం గాలిస్తున్నారు. ఘటనాస్థలిలో దొరికిన వస్తువుల ఆధారంగా దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. పాతకక్షల నేపథ్యంలో హత్య జరిగిందా లేదా మరేదైనా కారణం ఉందా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.


Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×