E-Paper
Advertisement

Srisailam Prasadam: శ్రీశైలం ప్రసాదంలో చికెన్ బొక్క.. ఆలయ అధికారులపై భక్తుడి అసహనం!

Srisailam Prasadam: శ్రీశైలం ప్రసాదంలో చికెన్ బొక్క.. ఆలయ అధికారులపై భక్తుడి అసహనం!
Advertisement

Prasadam of Srisailam Temple: శంభో శంకరా.. కాపాడవయ్య అంటూ భక్తులు శివనామ స్మరణ చేస్తూ భక్తులు శ్రీశైలం శివాలయాలకు వెళ్తుంటారు.. ఎంతో పవిత్రంగా ఉండే శ్రీశైలం మల్లికార్జున స్వామివారి ఆలయంలో శుక్రవారం అపచారం జరిగింది. వివరాల్లోకి వెళితే.. శ్రీశైలం వచ్చిన ఓ హైదరాబాద్ భక్తుడు.. శివయ్య దర్శనం తర్వాత ఆలయంలో పులిహోర ప్రసాదం కొనుగోలు చేశాడు. ఆ ప్రసాదంను ఆలయ ప్రాంగణంలో కూర్చొని తింటుండగా మధ్యలో ఏదో తగినట్లు కన్పించడంతో ఒక్క సారిగా షాక్ అయ్యాడు.. ఏంటా అని చూడగా అందులో చికెన్ బొక్క ఉన్నట్లు భక్తుడు తెలుసుకొని షాక్ కు గురి అయ్యాడు.

ఎంతో నిష్ఠగా తయారయ్యే పులిహోర ప్రసాదంలో మాంసం ఎముక రావటం కలకలం రేపుతోంది. ఈ విషయం పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతుంది. హైదరాబాద్ లోని కూకట్పల్లి కి చెందిన ఓ వ్యక్తి శ్రీశైలం మల్లన్న దర్శనం కోసం వెళ్లాడు. ఆలయ పరిధిలోని అమ్మవారి ఆలయం వెనుక బ్రహ్మానందరాయ గోపురం వద్ద ప్రసాదాల పంపిణీ చేస్తున్నారు. అక్కడికి వెళ్లి ప్రసాదం తీసుకున్న భక్తుడు హరీష్ రెడ్డికి పులిహోరలో మాంసపు ఎముక కనిపించింది.

Advertisement

అది చూసిన హరీష్ రెడ్డి తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. దేవస్థానం అధికారులకు లిఖితపూర్వకంగా ఎముక ముక్కను చూపించి ఫిర్యాదు చేశాడు. పవిత్రమైన ప్రాంతంలో ఏంటి ఈ అపచారం అంటూ.. ఎముక ఫోటోను యాడ్ చేసి ఓ లేఖను కూడా రాసి పంపాడు. పులిహోరలో మాంసపు ఎముకపై విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నాడు. అతనికి చాలా భక్తులు కూడా మద్దతుగా నిలిచినట్లు సమాచారం.. ఈ ఘటనపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related News

ఆంధ్రా పేపర్స్ లిమిటెడ్‌కు షాకిచ్చిన కూటమి సర్కార్.. స్పందిచిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్!

కూటమి సర్కార్ పై పేర్ని నాని ఫైర్.. డీఎస్సీపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్!

కొబ్బరి చెట్టుని ఢీ కొట్టిన కారు, స్పాట్ ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో ఘటన

తల్లి మందలింపుతో కోపం.. తండ్రి నవ్వాడని గొంతు కోసిన కొడుకు, చిత్తూరు జిల్లాలో దారుణం

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

Big Stories

Advertisement
×