BigTV English

Srisailam Devotees Rush : భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం ఆలయం.. ముక్కంటి దర్శనానికి నాలుగు గంటలు

Srisailam Devotees Rush : భక్తులతో కిక్కిరిసిన శ్రీశైలం ఆలయం.. ముక్కంటి దర్శనానికి నాలుగు గంటలు

Srisailam Devotees Rush : శ్రీగిరి మల్లన్న ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ముక్కంటీశుని దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు కార్తీక దీపాలు వెలిగించి నోములు నోచుకుంటున్నారు. శ్రీశైలంలో కార్తీకమాసం పౌర్ణమి, రెండో సోమవారం కూడా కలసి రావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి, అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శ్రీ స్వామి, అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతోంది. భక్తులు తెల్లవారుజాము నుంచే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించారు. వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగించి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు.


ముక్కంటీశుని ఆలయం ముందు భాగంలో గంగాధర మండపం వద్ద, ఉత్తర శివమాడవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందన్న ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది, సోమ వారాల్లో, పౌర్ణమి, ఏకాదశి రోజుల్లో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు.

మరోవైపు అలంకార దర్శనం ఏర్పాటుతో త్వరగతిన దర్శనాలు పూర్తవుతున్నాయి. అలానే నేటి సాయంత్రం కార్తీక పౌర్ణమి రెండో సోమవారం సందర్భంగా లక్షదీపోత్సవం, పుష్కరిణి హారతి, కృష్ణమ్మకు నది హారతి వైభవంగా నిర్వహించనున్నారు. ప్రధానాలయ ఈశాన్య భాగంలో ఉన్న ఆలయ పుష్కరిణి వద్ద ఈ కార్యక్రమాలు జరగనున్నాయి.


Tags

Related News

Tirumala: గుడ్ న్యూస్.. తిరుమల శ్రీవారి భక్తులకు మరో కానుక

Drone At Srisailam: శ్రీశైలంలో మరోసారి డ్రోన్ కలకలం.. అదుపులో ఇద్దరు యువకులు

AP Assembly: సొంత అజెండాతో బొత్స.. జగన్‌ను అవమానిస్తున్నాడా?

RTC BUS: ఆర్టీసీ బస్సులో సీటు కోసం మహిళలు రచ్చ రచ్చ.. ఎక్కడంటే..!

AP Govt: డ్వాక్రా మహిళలకు ఏపీ శుభవార్త.. ఆ శ్రమ తగ్గినట్టే, ఇంటి నుంచే ఇకపై

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

Big Stories

×