E-Paper
Advertisement

Jagan Palnadu Tour: నేడు పల్నాడుకి జగన్.. టూర్ సీక్రెట్ బయటకు, కారణం అదేనా?

Jagan Palnadu Tour: నేడు పల్నాడుకి జగన్.. టూర్ సీక్రెట్ బయటకు, కారణం అదేనా?
Advertisement

Jagan Palnadu Tour: వైసీపీ వేసే అడుగులు.. చేసిన పనులు కూటమి జాగ్రత్తగా గమనిస్తోందా? ఈ మధ్యకాలంలో జగన్ టూర్ల వెనుక అసలు కారణమేంటి? ఏపీలో శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసే పనిలోపడ్డారా? అందుకోసమే పోలీసులు ఆంక్షలు పెట్టారా? అయినా పార్టీ నేత చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్పు దేనికి? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను సైతం వెంటాడుతున్నాయి.

కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నెగిటివ్‌గా మార్చి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నేత చనిపోయి ఏడాది తర్వాత పల్నాడు ఎందుకు వెళ్తున్నారు? టూర్ ముసుగులో ఏదైనా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రచారానికి తెరలేపుతున్నట్లు కనిపిస్తోందని టీడీపీ పదేపదే ఎందుకు అంటోంది?

Advertisement

జగన్ పల్నాడు టూర్ గురించి టీడీపీ కీలక విషయాలు బయటపెట్టింది. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరుతారు. అక్కడి నుంచి తన వాహనంలో నేరుగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకి చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల వైస్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇంతవరకు షెడ్యూల్ బాగానే ఉంది.

ఇంతకీ నాగమల్లేశ్వరరావు ఎవరు? ఎప్పుడు చనిపోయాడు? దీనివెనుక అసలు కారణం ఎవరు అనే విషయాలను బయటపెట్టింది టీడీపీ. నాగమల్లేశ్వరావు బెట్టింగ్‌కు బలయ్యాడన్నది టీడీపీ చెబుతున్న మాట. దీనివెనుక మాజీ మంత్రి, ఆ పార్టీ నేత అనిల్‌కుమార్ ఉన్నారని అంటోంది.

Advertisement

ALSO READ: లిక్కర్ స్కామ్‌లో డొంక కదిలింది.. చెవిరెడ్డి అరెస్టు

గత ఎన్నికలకు ముందు వై నాట్ 175.. అన్ని సీట్లు తామే గెలుచుకుంటామని ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టింది ఆ పార్టీ.  దీని ద్వారా బెట్టింగులకు ప్రోత్సహించడం, ఆ ఉచ్చులో నష్టపోయినవారిలో  నాగమల్లేశ్వరరావు ఒకరు. సరిగ్గా ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు చనిపోతే ఇప్పుడు వెళ్లడం ఏంటన్నది పాలక పక్షం నుంచి ప్రశ్నలు రైజ్ చేస్తోంది.

కూటమి పాలనపై ఏడాది తర్వాత ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు జగన్. ఓదార్పు పేరుతో నాటకాలు అడుతున్నారని అంటోంది. బెట్టింగ్ బారిన పడి సర్వం కోల్పోయిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జూన్ 9 మరణించాడు. కరెక్టుగా ఏడాది తర్వాత ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు జగన్.

టీడీపీ నేతలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే జగన్ బయటకు వస్తారని అంటున్నారు. టీడీపీ ఆరోపణలు చేసినట్టుగానే జరుగుతోంది. ఇంతకీ జగన్ టూర్‌పై పోలీసులు ఏం చెబుతున్నారు? పల్లెటూరు ఆపై చిన్నరోడ్డు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా జగన్ సహా కేవలం వంద మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు.

జగన్ కాన్వాయ్‌తో పాటు అదనంగా మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు పల్నాడు ఎస్పీ తెలిపారు.  వాటిని అధిగమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పకనే చెప్పారు అధికారులు. వైసీపీ మాత్రం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.  మరి ఈ టూర్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

 

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×