E-Paper
Advertisement

Jagan Palnadu Tour: నేడు పల్నాడుకి జగన్.. టూర్ సీక్రెట్ బయటకు, కారణం అదేనా?

Jagan Palnadu Tour: నేడు పల్నాడుకి జగన్.. టూర్ సీక్రెట్ బయటకు, కారణం అదేనా?

Jagan Palnadu Tour: వైసీపీ వేసే అడుగులు.. చేసిన పనులు కూటమి జాగ్రత్తగా గమనిస్తోందా? ఈ మధ్యకాలంలో జగన్ టూర్ల వెనుక అసలు కారణమేంటి? ఏపీలో శాంతి భద్రతలు లేవని క్రియేట్ చేసే పనిలోపడ్డారా? అందుకోసమే పోలీసులు ఆంక్షలు పెట్టారా? అయినా పార్టీ నేత చనిపోయిన ఏడాది తర్వాత ఓదార్పు దేనికి? ఇవే ప్రశ్నలు వైసీపీ కార్యకర్తలను సైతం వెంటాడుతున్నాయి.

కూటమి ప్రభుత్వం చేస్తున్న పనులను నెగిటివ్‌గా మార్చి తనకు అనుకూలంగా మలచుకునే ప్రయత్నం జగన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. పార్టీ నేత చనిపోయి ఏడాది తర్వాత పల్నాడు ఎందుకు వెళ్తున్నారు? టూర్ ముసుగులో ఏదైనా విధ్వంసానికి ప్లాన్ చేస్తున్నారా? రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని ప్రచారానికి తెరలేపుతున్నట్లు కనిపిస్తోందని టీడీపీ పదేపదే ఎందుకు అంటోంది?

జగన్ పల్నాడు టూర్ గురించి టీడీపీ కీలక విషయాలు బయటపెట్టింది. బుధవారం ఉదయం తాడేపల్లి నుంచి జగన్ బయలుదేరుతారు. అక్కడి నుంచి తన వాహనంలో నేరుగా పల్నాడు జిల్లా రెంటపాళ్లకి చేరుకుంటారు. ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల వైస్ ప్రెసిడెంట్ నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. ఇంతవరకు షెడ్యూల్ బాగానే ఉంది.

ఇంతకీ నాగమల్లేశ్వరరావు ఎవరు? ఎప్పుడు చనిపోయాడు? దీనివెనుక అసలు కారణం ఎవరు అనే విషయాలను బయటపెట్టింది టీడీపీ. నాగమల్లేశ్వరావు బెట్టింగ్‌కు బలయ్యాడన్నది టీడీపీ చెబుతున్న మాట. దీనివెనుక మాజీ మంత్రి, ఆ పార్టీ నేత అనిల్‌కుమార్ ఉన్నారని అంటోంది.

ALSO READ: లిక్కర్ స్కామ్‌లో డొంక కదిలింది.. చెవిరెడ్డి అరెస్టు

గత ఎన్నికలకు ముందు వై నాట్ 175.. అన్ని సీట్లు తామే గెలుచుకుంటామని ఆ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టింది ఆ పార్టీ.  దీని ద్వారా బెట్టింగులకు ప్రోత్సహించడం, ఆ ఉచ్చులో నష్టపోయినవారిలో  నాగమల్లేశ్వరరావు ఒకరు. సరిగ్గా ఏడాది కిందట ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు చనిపోతే ఇప్పుడు వెళ్లడం ఏంటన్నది పాలక పక్షం నుంచి ప్రశ్నలు రైజ్ చేస్తోంది.

కూటమి పాలనపై ఏడాది తర్వాత ప్రజల్లోకి వెళ్లడం మొదలుపెట్టారు జగన్. ఓదార్పు పేరుతో నాటకాలు అడుతున్నారని అంటోంది. బెట్టింగ్ బారిన పడి సర్వం కోల్పోయిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. గతేడాది జూన్ 9 మరణించాడు. కరెక్టుగా ఏడాది తర్వాత ఓదార్పు యాత్ర మొదలుపెట్టారు జగన్.

టీడీపీ నేతలు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ఎవరైనా చనిపోయినప్పుడు మాత్రమే జగన్ బయటకు వస్తారని అంటున్నారు. టీడీపీ ఆరోపణలు చేసినట్టుగానే జరుగుతోంది. ఇంతకీ జగన్ టూర్‌పై పోలీసులు ఏం చెబుతున్నారు? పల్లెటూరు ఆపై చిన్నరోడ్డు నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా జగన్ సహా కేవలం వంద మందికి అనుమతి ఇచ్చారు పోలీసులు.

జగన్ కాన్వాయ్‌తో పాటు అదనంగా మరో మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్టు పల్నాడు ఎస్పీ తెలిపారు.  వాటిని అధిగమిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని చెప్పకనే చెప్పారు అధికారులు. వైసీపీ మాత్రం భారీగా ఏర్పాట్లు చేస్తోంది.  మరి ఈ టూర్‌లో ఏం జరుగుతుందో చూడాలి.

 

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×