E-Paper
Advertisement

Komatireddy Venkat Reddy: నేడు ఏపీకి తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి..

Komatireddy Venkat Reddy: నేడు ఏపీకి తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి..
Advertisement

Komatireddy Venkat Reddy: నేడు ఏపీకి తెలంగాణ మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డి వెళ్లడం.. రెండు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు కోమటి రెడ్డి. ఈ నేపథ్యంలో తాజాగా చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల మధ్య ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కోమటి రెడ్డి కలుస్తారా లేదా అన్న అంశంపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

తెలంగాణ రైజింగ్ సమ్మిట్ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడం, పరిశ్రమలను ప్రోత్సహించడం, ఉపాధి అవకాశాలను విస్తరించడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. దేశీ, విదేశీ పారిశ్రామికవేత్తలు, ప్రముఖ పెట్టుబడిదారులు, పారిశ్రామిక సంఘాలను ఈ సమ్మిట్‌కు ఆహ్వానించేందుకు రాష్ట్ర మంత్రులు ప్రత్యేకంగా వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగానే కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏపీకి వెళ్లినట్లు సమాచారం.

Advertisement

ఈ పర్యటనలో కోమటిరెడ్డి తొలుత చంద్రబాబును కలిసి తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌కు అధికారిక ఆహ్వానం అందించనున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఐటీ ఈఎస్ఎం, మౌలిక సదుపాయాల రంగాల్లో భారీ అనుభవం ఉన్న చంద్రబాబు ఈ సమ్మిట్‌కు హాజరవడం వల్ల పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది.

అయితే ఇటీవల తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారిన సంగతి తెలిసిందే. తాజా పరిణామాల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోమటిరెడ్డి కలుస్తారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Advertisement

Also Read: అమరావతిలో గౌతమ్ అదానీ, సీఎం చంద్రబాబుతో భేటీ, రాత్రివేళ సమావేశం వెనుక?

ఇక మరోవైపు, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ మధ్య గతంలో వివిధ అంశాలపై రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం అభివృద్ధి కేంద్రంగా ఇరు రాష్ట్రాలు కలిసి పనిచేసే దిశగా ముందుకు సాగుతున్నాయన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోమటిరెడ్డి పర్యటనను కేవలం ఒక ఆహ్వాన కార్యక్రమంగా మాత్రమే కాకుండా, రెండు రాష్ట్రాల మధ్య భవిష్యత్ సంబంధాలకు దిశానిర్దేశం చేసే కీలక అడుగుగా కూడా చూస్తున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×