E-Paper
Advertisement

Kuwait: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి, షాకైన పేరెంట్స్

Kuwait: కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి, షాకైన పేరెంట్స్

Kuwait: ఇరాన్‌‌పై అమెరికా-ఇజ్రాయెల్‌ యుద్ధం జఠిలమవుతోంది.  ఆయా దేశాలు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. రోజురోజుకూ గల్ఫ్‌‌‌లో ఉద్రిక్తత పరిస్థితులు తీవ్రమవుతున్నాయి. దీంతో అక్కడున్న తెలుగువారు ఇబ్బందులు పడుతున్నారు. బయటకు రావాలంటే మిస్సైళ్లు ఎక్కడ పడతాయోనని బెంబేలెత్తిపోతున్నారు. తాజాగా మిస్సైళ్ల శబ్దాలకు ఏపీకి చెందిన ఓ యువకుడు అక్కడ మృతి చెందారు. అసలేం జరిగింది?

కువైట్‌లో మిస్సైళ్ల దాడులు.. బాంబుల మోతకు తెలుగు వ్యక్తి బలి

ఇరాన్ సుప్రీం అయతుల్లా అలీ ఖమేని మృతితో ప్రతీకార దాడులకు తెగబడుతోంది ఇరాన్. దీంతో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ మెరుపుదాడులకు దిగాయి. అటు ఇరాన్ కూడా ఆయా దేశాలపై ఎదురుదాడులకు దిగింది. ఫలితంగా గల్ఫ్‌లో అమెరికా సైనిక స్థావరాలపై మిస్సైళ్ల దాడులు తీవ్రతరం చేసింది.

తాజాగా కువైట్‌లో బాంబుల మోతతో ఓ తెలుగు వ్యక్తి మృతి చెందాడు. మృతుడు ఏపీలోని పాలకొల్లు ప్రాంతానికి చెందినవాడు. మృతుడు రాజేష్‌గా గుర్తించారు. ఉపాది కోసం ఎనిమిది నెలల కిందట కువైట్ వెళ్లాడు రాజేష్. అక్కడికి వెళ్లిన నాలుగు నెలల తర్వాత అక్కడ ఉపాధి లభించింది.

మృతుడి సొంతూరు పాలకొల్లు.. కొడుకు డెడ్‌బాడీని రప్పించాలని  పేరెంట్స్ ప్రభుత్వానికి విజ్ఞప్తి

గడిచిన ఐదు రోజులుగా ఇరాన్-అమెరికా మధ్య దాడులు తీవ్రమయ్యాయి. ఈ క్రమంలో సోమవారం ఉదయం తల్లిదండ్రులకు ఫోన్ చేసి మాట్లాడాడు రాజేష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను ఉండలేనని, వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పుడు రావడం మంచిదికాదని, యుద్ధం ముగిసిన తర్వాత రావాలని, ఈ విషయంలో కంగారు పడవద్దని రాజేష్‌కి తల్లిదండ్రులు సూచన చేశారు.

సరేనని అన్నాడు.. ఈలోగా మిస్సైళ్ల శబ్దాలతో రాజేష్ తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఛాతిలో నొప్పి వచ్చింది. వెంటనే సమీపంలోకి దగ్గర వ్యక్తులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికి రాజేష్ ఈ లోకాన్ని విడిచిపెట్టాడు. ఈ విషయాన్ని అక్కడివారు రాజేష్ తల్లిదండ్రులకు తెలిపారు. ఈ వార్త విని ఒక్కసారిగా షాకయ్యారు.

ALSO READ: ఏపీలో ఠారెత్తిస్తున్న ఎండలు.. ఆ జిల్లాలకు అలర్ట్

రాజేష్ తల్లిదండ్రులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు పాలకొల్లులో ఉండగా, రెండో కొడుకు ఉపాధి కోసం కువైట్ వెళ్లాడు. అక్కడికి వెళ్లిన తర్వాత మొదట నాలుగు నెలలు ఖాళీగా ఉన్నాడని, ఆ తర్వాత పని దొరికిందని చెప్పారు మృతుడి తల్లిదండ్రులు. బాంబు శబ్దాలకు భయపడి గుండెపోటుతో మరణించినట్టు తెలిపాడు. తమ కుమారుడి మృతదేహాన్ని ఇక్కడకు రప్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కు విజ్ఞప్తి చేశాడు. ఎలాగైనా మా కొడుకుని సొంతూరుకు రప్పించాలని కన్నీరుమున్నీరు అవుతున్నారు రాజేష్ తల్లిదండ్రులు.

Related News

Amaravati: చంద్రబాబు కేబినెట్ భేటీ.. మధ్యలో వెళ్లిపోయిన పవన్ కళ్యాణ్, ఏం జరిగింది?

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

Big Stories

×