E-Paper
Advertisement

JanaSena : గాజు గ్లాసు తిరిగొచ్చిందోచ్.. జనసేనలో జోష్..

JanaSena : గాజు గ్లాసు తిరిగొచ్చిందోచ్.. జనసేనలో జోష్..

JanaSena (political news in ap) : జనసేన శ్రేణులకు ఏపీ ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ గుర్తును గాజు గ్లాసుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. ఇది జనసేన ఊరటగా చెప్పొచ్చు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే ఈ ఉత్తర్వలు అమలు అవుతాయి.

ఈ ఏడాది మేలో గుర్తింపు పొందిన పార్టీల వివరాల్ని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన గాజు గ్లాసు గుర్తును కోల్పోయిందని ఈసీ తెలపింది. ఎన్నికల కమీషన్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చేసింది.

2019 ఎన్నికలకు ముందు ఈసీ.. జనసేనకు గాజు గ్లాసును కేటాయించిన తరువాత.. పార్టీ శ్రేణులు గుర్తును ప్రజల్లో విజయవంతంగా తీసుకొని వెళ్లారు. కానీ, తరువాత పార్టీ గుర్తు కోల్పోవడంతో.. జనసేనకు గట్టి షాక్ తలిగినట్టు అయింది. దీంతో.. ప్రత్యర్థి వైసీపీ నేతలు జనసేనపై సెటైర్ల కూడా వేశారు. ఇటీవల పేర్ని నాని కూడా మీ పార్టీ గుర్తు పోయింది.. వెతుక్కొండి అంటూ సెటైర్లు వేశారు. అయితే.. ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం జనసేనకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×