BigTV English

JanaSena : గాజు గ్లాసు తిరిగొచ్చిందోచ్.. జనసేనలో జోష్..

JanaSena : గాజు గ్లాసు తిరిగొచ్చిందోచ్.. జనసేనలో జోష్..


JanaSena (political news in ap) : జనసేన శ్రేణులకు ఏపీ ఎన్నికల సంఘం తీపి కబురు చెప్పింది. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ గుర్తును గాజు గ్లాసుగా కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనసేనను రిజర్వుడు సింబల్ కలిగిన రిజిస్టర్డ్ పార్టీల జాబితాలోనే ఉంచింది. ఇది జనసేన ఊరటగా చెప్పొచ్చు. అయితే.. స్థానిక సంస్థల ఎన్నికలకు మాత్రమే ఈ ఉత్తర్వలు అమలు అవుతాయి.

ఈ ఏడాది మేలో గుర్తింపు పొందిన పార్టీల వివరాల్ని ఎన్నికల కమీషన్ వెల్లడించింది. పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన గాజు గ్లాసు గుర్తును కోల్పోయిందని ఈసీ తెలపింది. ఎన్నికల కమీషన్ గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చేసింది.


2019 ఎన్నికలకు ముందు ఈసీ.. జనసేనకు గాజు గ్లాసును కేటాయించిన తరువాత.. పార్టీ శ్రేణులు గుర్తును ప్రజల్లో విజయవంతంగా తీసుకొని వెళ్లారు. కానీ, తరువాత పార్టీ గుర్తు కోల్పోవడంతో.. జనసేనకు గట్టి షాక్ తలిగినట్టు అయింది. దీంతో.. ప్రత్యర్థి వైసీపీ నేతలు జనసేనపై సెటైర్ల కూడా వేశారు. ఇటీవల పేర్ని నాని కూడా మీ పార్టీ గుర్తు పోయింది.. వెతుక్కొండి అంటూ సెటైర్లు వేశారు. అయితే.. ఇప్పుడు ఏపీ ఎన్నికల సంఘం నిర్ణయం జనసేనకు కాస్త ఊరటనిచ్చిందనే చెప్పాలి.

Related News

Kurnool News: దసరా ఫెస్టివల్.. రాత్రికి దేవరగట్టులో కర్రల సమరం.. భారీగా ఏర్పాటు

Jagan Vs Chandrababu: సీఎం చంద్రబాబుపై జగన్ మరో అస్త్రం.. ఇప్పటికైనా మేలుకో, లేకుంటే

Vijayawada Durga Temple: దసరా రోజున వీఐపీ దర్శనాలు లేవు.. కృష్ణానది ఉద్ధృతితో తెప్పోత్సవం రద్దు: దుర్గగుడి ఈవో

Kendriya Vidyalayas: ఏపీకి కేంద్రం గుడ్ న్యూస్.. నాలుగు కొత్త కేంద్రీయ విద్యాలయాలకు గ్రీన్ సిగ్నల్.. దేశవ్యాప్తంగా 57 కేవీలు

CM Chandrababu: 2029 నాటికి ప్రతి ఒక్కరికీ ఇల్లు.. అక్టోబర్ 4న వారి ఖాతాల్లో రూ.15 వేలు: సీఎం చంద్రబాబు

Rajahmundry To Tirupati Flight Service: రాజమండ్రి నుంచి తిరుపతికి విమాన సర్వీసులు ప్రారంభం.. టికెట్ రూ.1999 మాత్రమే!

Onion Farmers: మద్దతు ధర లేక.. ఉల్లిని వాగులో పోసిన రైతు

Delhi Politics: అమిత్ షాతో సీఎం చంద్రబాబు.. ముప్పావు గంట భేటీ, వైసీపీలో వణుకు?

Big Stories

×