BigTV English
Advertisement

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..

TTD Chairman BR Naidu: ఎట్టకేలకు టీటీడీ చైర్మన్ నియామకం.. బీఆర్ నాయుడుకు ఛాన్స్.. తెలంగాణ నుండి కూడా..

24 మంది సభ్యులతో టీటీడీ కొత్త పాలకమండలి
ఈసారి తెలంగాణ నుంచి ఐదుగురికి చోటు
ముగ్గురు టీడీపీ ఎమ్మెల్యేలను వరించిన అదృష్టం
అధికారిక ప్రకటన విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం


అమరావతి, స్వేచ్ఛ:
TTD Chairman BR Naidu: తిరుమల తిరుమతి దేవస్థానం ఛైర్మన్‌గా టీవీ5 అధినేత బీఆర్ నాయుడు నియమితులయ్యారు. 24 మంది సభ్యులతో కొత్త పాలకమండలి ఏర్పాటు చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఇందులో ఏపీ నుంచి, అందులోనూ టీడీపీ నుంచి ఎక్కువ మంది ఉన్నారు. తెలంగాణ (ఐదుగురు), మహారాష్ట్ర (ఒకరు), కర్ణాటక (ముగ్గురు), తమిళనాడు (ఇద్దరు), గుజరాత్ (ఒకరు) రాష్ట్రాల నుంచి పలువురికి పాలమండలిలో చోటు దక్కింది. ఇందులో టీడీపీ ఎమ్మెల్యేలు ముగ్గురు, మాజీ మంత్రులు, సీనియర్లు ఉన్నారు. వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరిన జంగా కృష్ణమూర్తి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు నమ్మకస్తుడు, ఆర్ట్ డైరెక్టర్ బూరగాపు ఆనందసాయి టీటీడీ మెంబర్‌గా ఎన్నికయ్యారు.

సభ్యులు వీరే..
జ్యోతుల నెహ్రూ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎమ్మెస్‌ రాజు, పనబాక లక్ష్మి, జాస్తి పూర్ణ సాంబశివరావు, శ్రీసదాశివరావు నన్నపనేని, జంగా కృష్ణమూర్తి, నన్నూరి నర్సిరెడ్డి, బూంగునూరు మహేందర్‌ రెడ్డి, బూరగాపు ఆనందసాయి, సుచిత్ర ఎల్ల, కృష్ణమూర్తి, పి.రామ్మూర్తి, కోటేశ్వరరావు, మల్లెల రాజశేఖర్‌ గౌడ్‌, ఆర్‌.ఎన్‌ దర్శన్‌, జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్‌, శాంతారామ్‌, జానకీ దేవి తమ్మిశెట్టి, అనుగోలు రంగశ్రీ, నరేశ్‌కుమార్‌, డా.అదిత్‌ దేశాయ్‌, శ్రీసౌరబ్‌ హెచ్‌ బోరాలు టీటీడీ మెంబర్లుగా పాలకమండలిలో ఉన్నారు.


Related News

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Big Stories

×