E-Paper
Advertisement

Tirumala News: తిరుమలలో ఫోటోషూట్ ఇష్యూ.. తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ..

Tirumala News: తిరుమలలో ఫోటోషూట్ ఇష్యూ.. తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ..
Advertisement

Tirumala News: తిరుమల కొండపై కొత్త జంట ఫోటోషూట్ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? ఫోటోషూట్ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో నేరుగా నూతన దంపతులు రంగంలోకి దిగారు. అంతేకాదు కొన్ని విషయాలు బయటపెట్టారు. మళ్లీ వస్తామని అంటున్నారు. ఇంతకీ అసలు అక్కడ ఏం జరిగింది?

తిరుమలలో దంతపుల ఫోటోషూట్ వ్యవహారం

Advertisement

తిరుమల కొండపై నూతన దంపతులు మాడవీధుత్లో నానాహంగామా చేశారు. లొకేషన్ ఎక్కడ బాగుంటే అక్కడ ఫోటోషూట్ చేశారు. అంతేకాదు నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారాలు బయటకు కనిపించడంతో భక్తులు ఓ రేంజ్‌లో దుమ్మెత్తిపోశారు. ఈ జంటకు చెందిన వీడియో నెట్టింట్లో వైరల్ కావడంతో తొలుత కంగారుపడింది ఆ జంట. తమ పరువు పోతుందని భావించిన నేరుగా ఓ వీడియో రిలీజ్ చేసింది.

తమిళనాడులోని తిరువన్నామలైకి చెందిన తిరుమల్-గాయత్రి దంపతులకు ఇటీవల వివాహం జరిగింది. వివాహం తర్వాత ఈ జంట తొలుత తిరుమల పర్యటనకు వచ్చింది. ఆ సమయంలో శ్రీవారి ఆలయ మాడ వీధుల్లో సినిమాటిక్ స్టైల్‌లో ఫోటో‌షూట్ చేశారు. అంతేకాదు మధ్యమధ్యలో కొన్ని రీల్స్ చేశారట. తిరుమల కొండపై రీల్స్, ఫోటోషూట్‌ లపై ఆంక్షలు ఉన్నప్పటికీ భద్రతా సిబ్బంది కళ్లుగప్పారు.

Advertisement

తెరపైకి నూతన దంపతులు, మళ్లీ వస్తామంటూ

వీరి వ్యవహారంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అప్రమత్తమైన ఆ దంపతులు ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలనే ఉద్దేశ్యం మాకు లేదన్నారు. తెలియక చేసిన తప్పును క్షమించాలని అందులో కోరారు. త్వరలో తిరుమలకు వచ్చి శ్రీవారి సేవలో పాల్గొని చేసిన తప్పును సరిదిద్దుకుంటామని వేడుకున్నారు.

ఈ వ్యవహారంలో తప్పంతా సెక్యూరిటీ సిబ్బందేనని అంటున్నారు శ్రీవారి భక్తులు.  స్వామి సన్నిధిలో అంత జరుగుతున్నా సెక్యూరిటీ ఏం చేస్తోందని ప్రశ్నిస్తున్నారు? తిరుమల కొండపై అడుగడుగునా సీసీటీవీ కెమెరాలు ఉన్నాయని, వాటిని మోనటరింగ్ చేస్తున్న సిబ్బంది మాటేంటి?  అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. తప్పులు చేసి సారీ చెప్పడం ఈ మధ్యకాలంలో ఫ్యాషన్‌గా మారిందని అంటున్నారు.

ALSO READ: అరవ శ్రీధర్ ఎంత పని చేశారు.. కొత్త వీడియోలో కీలక అంశాలు

నూతన దంపతులు చేసిన తప్పును తెలుసుకున్నారని అంటున్నారు. బాధ్యతలు నిర్వహిస్తున్న సెక్యూరిటీ పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనని అంటున్నారు. ఇలాంటి తప్పు మరొకసారి జరగకుండా ఉండాలంటే కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందేనని అంటున్నారు.

 

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×