E-Paper
Advertisement

Eesha Rebba: త్రివిక్రమ్ మోసం చేశారు.. గుట్టు రట్టు చేసిన ఈషా రెబ్బా

Eesha Rebba: త్రివిక్రమ్ మోసం చేశారు.. గుట్టు రట్టు చేసిన ఈషా రెబ్బా

Eesha Rebba: ప్రముఖ హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో అందంతో అందరినీ ఆకట్టుకుంటూ మరింత బిజీగా మారిపోయింది.’అంతకుముందు ఆ తర్వాత’ అనే సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ.. మాయ మాల్, దర్శకుడు, బ్రాండ్ బాబు, బందిపోటు, అమీ తుమీ, సుబ్రహ్మణ్యపురం , అ!, రాగల 24 గంటల్లో, మామా మశ్చీంద్ర వంటి చిత్రాలలో నటించి భారీ పాపులారిటీ సొంతం చేసుకుంది. అయితే అందం అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో క్రేజీ ఆఫర్లు మాత్రం రావడం లేదనే చెప్పాలి.

‘ఓం శాంతి శాంతి శాంతిః’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషా రెబ్బా

అలాంటి ఈమె చాలా రోజుల తర్వాత ప్రముఖ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ (Tarun Bhaskar) హీరోగా నటిస్తున్న ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈరోజు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పైగా జంటగా ఈ సినిమా చూసేవారి కోసం వన్ ప్లస్ వన్ ఆఫర్ టికెట్ కూడా చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.. ఇక ప్రత్యేకంగా ఎంపిక చేయబడిన థియేటర్లలో నిన్న ప్రీమియర్ షోలు కూడా పడ్డాయి. అలా ఈ సినిమాపై మరింత హైప్ పెంచడానికి వరుస ప్రమోషనల్ ఇంటర్వ్యూలు ఇస్తున్న ఈషా రెబ్బా తన కెరియర్ లో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి కూడా చెప్పుకొచ్చింది.

త్రివిక్రమ్ నన్ను మోసం చేశారు..

ఈషా రెబ్బా మాట్లాడుతూ.. “ఒక సినిమా విషయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ నన్ను మోసం చేశారు” అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. జూనియర్ ఎన్టీఆర్)Jr NTR) హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో.. పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్గా నటించిన చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ . ఇందులో పూజా హెగ్డే కి చెల్లి పాత్రలో నటించింది ఈషా రెబ్బా. అప్పటికే హీరోయిన్గా సెటిల్ అయినా ఈమెకు ఈ సినిమాలో పాత్ర చూసిన తర్వాత కనీసం ప్రాధాన్యత లేని సపోర్టింగ్ రోల్ ఎందుకు చేసిందని ఆమె అభిమానులు కూడా పెదవి విరిచారు. అయితే తాజాగా ఈ విషయంపై ఈషా స్పందించింది.

ALSO READ:MS Narayana: మాట కోసం సర్వం కోల్పోయిన మహానటుడు.. ఎమ్మెస్ కుమార్తె ఎమోషనల్ కామెంట్స్!

చాలా బాధపడ్డాను..

ఈషా మాట్లాడుతూ..” అరవింద సమేత కథ విన్నప్పుడు ఆ సినిమాలో నటించాలని అనుకున్నాను. అయితే కమర్షియల్ సినిమాలో హీరోయిన్గా కాకుండా వేరే పాత్రలు చేస్తే ఆడియన్స్ ఆదరించారు అనే భయం కలిగింది. పైగా తదుపరి చిత్రాల్లో కూడా అలాంటి అవకాశాలు వస్తాయేమో అని కాస్త భయపడ్డాను. ఆ సమయంలో త్రివిక్రమ్ నాదొక లీడ్ రోల్ అని చెప్పారు. ఒకవైపు హ్యాపీగా ఉన్నా.. ఫ్యూచర్లో స్టీరియో టైప్ చేసేస్తారని మరొకవైపు టెన్షన్ పడ్డాను. కానీ కొన్ని రోజులకు ఆ భయం పోయింది. పెద్ద ప్రొడక్షన్ హౌస్.. బిగ్ డైరెక్టర్.. పెద్ద ప్రాజెక్టు కాబట్టి అందరూ నా గురించి మాట్లాడుకునే వారు. అయితే సినిమా విడుదలైన తర్వాత చాలామంది ఫోన్ చేసి ఈ సినిమా ఎందుకు చేసావ్.. అసలు ఆ పాత్రలో ఏముంది? అని అడిగారు. ఎంతో బాధపడ్డాను. నాకు ఇతర క్యారెక్టర్లు చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.. కాకపోతే అలాంటి రోల్స్ చేసుకుంటూ పోతే హీరోయిన్ గా నన్ను అంగీకరించరేమో అన్న భయం ఉందని” ఆమె చెప్పుకొచ్చింది మొత్తానికైతే మంచి పాత్ర అని చెప్పి తనకు అలాంటి పాత్ర ఇచ్చే మోసం చేశారని త్రివిక్రమ్ పేరు ప్రస్తావించకుండా ఇన్ డైరెక్ట్ గా చెప్పుకొచ్చింది ఈషా రెబ్బా.

Related News

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

బాబాయ్ రికార్డులకు ఎసరు పెట్టిన అబ్బాయ్.. ప్రీమియర్ ‘షో’ చూపించేశాడు!

మెగాస్టార్‌ను మించిపోయిన రామ్ చరణ్.. అంతగా ‘పెద్ది’తో ఏం చేశాడంటే?

‘పెద్ది’ ఎంట్రీ చూసి ఉపాసన ఏం చేసిందో తెలిస్తే షాక్ అవుతారు.. అయితే సినిమా..

Big Stories

×