E-Paper
Advertisement

Marriage Bureau Fraud: ప్రేమ, పెళ్లి అని చెప్పి చివరికి.. విశాఖలో మ్యారేజ్ బ్యూరోల అరాచకం

Marriage Bureau Fraud: ప్రేమ, పెళ్లి అని చెప్పి చివరికి.. విశాఖలో మ్యారేజ్ బ్యూరోల అరాచకం
Advertisement

Marriage Bureau Fraud: విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరుతో అరాచకాలకు పాల్పడుతుందోముఠా. పెళ్లి కానీ యువతులే టార్గెట్‌గా దుండగులు ఆగడాలకు పాల్పడుతున్నారు. మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. బాధితులు స్పృహ కోల్పోయిన సమయంలో.. వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట దుండగులు అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలికి గుట్టు చప్పుడు రాకుండా అబార్షన్ చేయిస్తున్నారు.

తాజాగా విశాఖలో మ్యారేజ్‌ బ్యూరో మాటున లైంగిక వేదింపులకు పాల్పడుతున్న యువకుడి ఘటన వెలుగు చూసింది. కంచరపాలెంకు చెందిన రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

Advertisement

రవీంద్ర యాదవ్ తల్లిదండ్రులు కంచరపాలెంలో వివాహ వేదిక పేరుతో మ్యారేజ్‌ బ్యూరో నడుపుతున్నారు. వివాహ వేదికకు వచ్చే అమ్మాయిలను.. రవీంద్ర యాదవ్‌ ట్రాప్ చేసి, ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. పరిచయమైన యువతులకు కాల్ చేసి వీడియో కాల్‌లో న్యూడ్‌గా మాట్లాడాలని రవీంద్ర యాదవ్ బెదిరిస్తున్నట్టు ఆరోపించింది. రవీంద్ర యాదవ్‌ అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తాను మాట్లాడిన వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది బాధిత యువతి.

ఈ తరుణంలో విశాఖలో నలుగురు మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మ్యారేజ్ బ్యూరో మాటున అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో.. రవీంద్ర యాదవ్, అతని తండ్రి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్త్ పోలీస్ స్టేషన్‌‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు రవీందర్ యాదవ్‌‌ను శ్రీకాళంలో అరెస్ట్ చేసి ఫోర్త్ టౌన్‌‌ పోలీస్ స్టేషన్‌‌కి తరలించినట్లు సమాచారం.

Advertisement

Also Read: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఆ తేదీలు మరిచిపోవద్దు

ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశారని.. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని, అబార్షన్‌ చేయించాడని రవీంద్ర యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. వివాహ వేదికకు వచ్చే అమ్మాయిలను రవీంద్ర యాదవ్‌ ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. తనతో పాటు మరో 30 మంది అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా న్యూడ్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×