BigTV English
Advertisement

Marriage Bureau Fraud: ప్రేమ, పెళ్లి అని చెప్పి చివరికి.. విశాఖలో మ్యారేజ్ బ్యూరోల అరాచకం

Marriage Bureau Fraud: ప్రేమ, పెళ్లి అని చెప్పి చివరికి.. విశాఖలో మ్యారేజ్ బ్యూరోల అరాచకం

Marriage Bureau Fraud: విశాఖలో మ్యారేజ్ బ్యూరో పేరుతో అరాచకాలకు పాల్పడుతుందోముఠా. పెళ్లి కానీ యువతులే టార్గెట్‌గా దుండగులు ఆగడాలకు పాల్పడుతున్నారు. మత్తుమందు ఇచ్చి అత్యాచారాలు చేస్తున్నారు. బాధితులు స్పృహ కోల్పోయిన సమయంలో.. వీడియోలు చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. మ్యారేజ్ బ్యూరో, హెర్బల్ ప్రొడక్ట్స్, ర్యాపిడో పేరిట దుండగులు అమ్మాయిల వివరాలు సేకరిస్తున్నారు. గర్భం దాల్చిన బాధితురాలికి గుట్టు చప్పుడు రాకుండా అబార్షన్ చేయిస్తున్నారు.


తాజాగా విశాఖలో మ్యారేజ్‌ బ్యూరో మాటున లైంగిక వేదింపులకు పాల్పడుతున్న యువకుడి ఘటన వెలుగు చూసింది. కంచరపాలెంకు చెందిన రవీంద్ర యాదవ్ అనే వ్యక్తి తనను మోసం చేశాడని సోషల్ మీడియా వేదికగా ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసింది.

రవీంద్ర యాదవ్ తల్లిదండ్రులు కంచరపాలెంలో వివాహ వేదిక పేరుతో మ్యారేజ్‌ బ్యూరో నడుపుతున్నారు. వివాహ వేదికకు వచ్చే అమ్మాయిలను.. రవీంద్ర యాదవ్‌ ట్రాప్ చేసి, ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. పరిచయమైన యువతులకు కాల్ చేసి వీడియో కాల్‌లో న్యూడ్‌గా మాట్లాడాలని రవీంద్ర యాదవ్ బెదిరిస్తున్నట్టు ఆరోపించింది. రవీంద్ర యాదవ్‌ అకృత్యాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో తాను మాట్లాడిన వీడియో విడుదల చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది బాధిత యువతి.


ఈ తరుణంలో విశాఖలో నలుగురు మ్యారేజ్‌ బ్యూరో నిర్వాహకులపై కేసు నమోదు చేశారు పోలీసులు. మ్యారేజ్ బ్యూరో మాటున అమ్మాయిలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారంటూ ఓ యువతి ఫిర్యాదు చేయడంతో.. రవీంద్ర యాదవ్, అతని తండ్రి, మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్త్ పోలీస్ స్టేషన్‌‌లో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు రవీందర్ యాదవ్‌‌ను శ్రీకాళంలో అరెస్ట్ చేసి ఫోర్త్ టౌన్‌‌ పోలీస్ స్టేషన్‌‌కి తరలించినట్లు సమాచారం.

Also Read: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఆ తేదీలు మరిచిపోవద్దు

ప్రేమ, పెళ్లి పేరుతో తనను మోసం చేశారని.. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా వాడుకొని, అబార్షన్‌ చేయించాడని రవీంద్ర యాదవ్‌పై ఫిర్యాదు చేసింది. వివాహ వేదికకు వచ్చే అమ్మాయిలను రవీంద్ర యాదవ్‌ ట్రాప్ చేసి ప్రేమ పేరుతో మోసం చేస్తున్నాడని యువతి ఆరోపిస్తోంది. తనతో పాటు మరో 30 మంది అమ్మాయిలను మోసం చేయడమే కాకుండా న్యూడ్ వీడియోస్ సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

Related News

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Tirupati Laddu Controversy: తిరుమల లడ్డు కల్తీ నెయ్యి కేసులో సీబీఐ సిట్ దూకుడు.. కీలక నిందితుడు అరెస్ట్

AP Investments: ఏపీకి భారీగా తరలివస్తున్న పెట్టుబడులు.. లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులకు ఆమోదం..

MSK Prasad: ఎమ్మెస్కే ప్రసాద్ ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు సీరియస్

Big Stories

×