E-Paper
Advertisement

Alluri Sitarama Raju : అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై హత్యాచారం..

Alluri Sitarama Raju : అల్లూరి సీతారామరాజు జిల్లాలో దారుణం.. గిరిజన బాలికపై హత్యాచారం..
Advertisement

Alluri Sitarama Raju : తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లడంతో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ నిందితుడు. తన నేరం బయటపడుతుందని భావించి బాలికను చంపేద్దామని నిర్ణయించుకున్నాడు. స్నేహితుడితో కలిసి ఆమె ఇంటికి వెళ్లారు. ఎలాగూ హతమారుస్తున్నాం కదా అని ఇద్దరూ కలిసి మరోసారి లైంగికదాడికి పాల్పడ్డారు. చివరికి ఆ అమాయకురాలిని హత్య చేశారు. ఈ ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చింతపల్లిలో చోటు చేసుకొంది. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

చింతపల్లి ఎస్పీ ప్రతాప్‌ శివకిషోర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గూడెం కొత్తవీధి మండలంలోని మారుమూల గ్రామానికి చెందిన ఓ గిరిజన బాలిక తల్లిదండ్రులు జనవరి 2న వ్యవసాయ పనులకు వెళ్లారు. దీంతో ఆటో డ్రైవర్‌ పాంగి రమేశ్‌(19) అనే యువకుడు ఓ బాలికను బెదిరించి మరో ఇంట్లోకి బలవంతంగా తీసుకెళ్లాడు. బాలికను రమేష్ లాక్కుని వెళ్లడాన్ని కొందరు చిన్నారులు చూశారు. రమేశ్‌ తనపై లైంగికదాడికి పాల్పడినట్లు బాలిక తన బంధువుకు చెప్పింది. ఈ విషయం గ్రామంలో అందరికీ తెలిసిపోతుందని రమేశ్‌ భయపడ్డాడు. తన స్నేహితుడైన మరో ఆటోడ్రైవర్‌ సీతన్నకు జరిగిన విషయం చెప్పాడు. బాలిక తల్లిదండ్రులు ఇంటికి వచ్చేలోగా ఆమెను చంపేద్దామని నిర్ణయించుకున్నారు.

Advertisement

మొదట రమేశ్‌ ఇంట్లోకి ప్రవేశించాడు కొంతసేపటి తర్వాత సీతన్న కూడా వెళ్లాడు . ఎలాగూ ప్రాణాలు తీస్తున్నాం అని ఇద్దరూ కలిసి మరోసారి ఆమెపై అత్యాచారం చేశారు. అనంతరం తన గొంతు కుచీరతో ముడి వేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించలని తనని దూలానికి వేలాడదీసి పరారయ్యారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక తల్లిదండ్రులు తమ కుమార్తె చనిపోవడంతో కన్నీరుమున్నీరయ్యారు. మరుసటి రోజు అంత్యక్రియల్లో భాగంగా మృతురాలికి స్నానం చేయిస్తుండగా.. శరీరంపై గాయాలు కనిపించాయి. తల్లిదండ్రులకు అనుమానం వచ్చినప్పటికీ.. అంతక్రియలు పూర్తి చేశారు.

ఈనెల 5న గూడెం కొత్తవీధి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. సీఐ అశోక్‌కుమార్‌, ఎస్సై అప్పలసూరి గ్రామానికి వెళ్లి అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. రెవెన్యూ అధికారులు, వైద్యుల సమక్షంలో ఖననం చేసిన మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టం చేశారు. నిందితులిద్దరూ తమ పేర్లు బయటకు వస్తాయని భావించి వీఆర్వో సాయంతో పోలీసుల ఎదుట లొంగిపోయారు. నిందితులపై పోక్సోతోపాటు అత్యాచారం, హత్య కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ వెల్లడించారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×