E-Paper
Advertisement

Union Budget 2026: ఏపీ మైనింగ్‌పై కేంద్రం వరాల జల్లు.. నిర్మలమ్మ నోట పసందైన ప్రకటన!

Union Budget 2026: ఏపీ మైనింగ్‌పై కేంద్రం వరాల జల్లు.. నిర్మలమ్మ నోట పసందైన ప్రకటన!
Advertisement

Union Budget 2026: కేంద్ర బడ్జెట్ – 2026 ప్రసంగం సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటు వేదికగా కీలక ప్రకటన చేశారు. ఖనిజ వనరులు అధికంగా ఉన్న ఏపీ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని వెల్లడించారు. అరుదైన ఖనిజాల (రేర్ ఎర్త్ మినరల్) కోసం ఏపీతో పాటు తమిళనాడు, కేరళ, ఒడిశా రాష్ట్రాలలో ఖనిజాల కోసం ప్రత్యేక కారిడార్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే?

బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ‘అరుదైన భూమి శాశ్వత అయస్కాంతాల పథకం (scheme for rare earth permanent magnets) 2025 నవంబర్ లో ప్రారంభించాం. మైనింగ్, ప్రాసెసింగ్, పరిశోధన, తయారీని ప్రోత్సహించడం కోసం ఖనిజ సంపన్న రాష్ట్రాలుగా పిలవబడుతున్న ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు కేంద్రం అండగా ఉంటుందని తెలియజేస్తున్నా’ అని ఆదివారం బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి అన్నారు.

ఇప్పటివరకూ చైనానే ఆధారం..

Advertisement

అరుదైన భూమి (Rare earths) అనేది 17 ఖనిజ మూలకాల సమూహం. దీనిని మనం నిత్యం ఉపయోగించే స్మార్ట్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ కార్ల నుంచి ఫైటర్ జెట్స్ తయారీ వరకూ ప్రతి దానిలోనూ వినియోగిస్తుంటారు. చైనా ప్రస్తుతం ఈ రేర్ ఎర్త్స్ విషయంలో ప్రపంచంపై అజమాయిషి చెలాయిస్తోంది. ప్రపంచ గనుల ఉత్పత్తిలో 60 శాతం, శుద్ధి చేసిన ఖనిజాలు (Refined production), రేర్ ఎర్త్ మాగ్నెట్ (Rare earth magnet)లో 90 శాతం వాటాను డ్రాగన్ కలిగి ఉంది.

Also Read: Budget 2026: హైదరాబాద్ కనెక్టివిటీకి లక్షల కోట్ల కేటాయింపు.. రియల్ ఎస్టేట్, బిజినెస్‌లో భారీ మార్పులు !

చైనాకు చెక్ పెట్టేలా..

Advertisement

ఫలితంగా అరుదైన ఖనిజ సంపద కోసం భారత్ సహా ప్రపంచ దేశాలు చైనాపై ఆధారపడుతూ వస్తున్నాయి. దీని నుంచి బయటపడేందుకు.. ఖనిజ సంపదను కలిగిన రాష్ట్రాలుగా పేరున్న ఆంధ్రప్రదేశ్ సహా తమిళనాడు, కేరళ, ఒడిశా నుంచి అరుదైన మినరల్స్ ను దేశ అవసరాలకు సమకూర్చుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగా 2026-27 కేంద్ర బడ్జెట్ లక్ష్యాల్లో ఒకటిగా దీనిని చేర్చింది. దేశీయ అవసరాలు పోగా.. విదేశాలకు సైతం ఈ ఖనిజ సంపదను ఎగుమతి చేసి.. చైనాకు చెక్ పెట్టాలని కేంద్రం భావిస్తున్నట్లు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.

Also Read: Union Budget 2026: బడ్జెట్ 2026 స్పెషల్.. నిర్మలా సీతారామన్ కట్టిన చీర చూశారా? రాజకీయంగా ఆసక్తికర చర్చ!

Related News

కూటమిని విడగొట్టేందుకు వైసీపీ స్కెచ్.. విజయ్‌ విక్టరీని చూపిస్తూ పవన్ టార్గెట్, ఇంతకీ అంబటి ఏమన్నారు?

ప్రభుత్వ స్కూల్ టెన్త్ టాపర్లకు అపూర్వ గౌరవం.. గన్నవరం నుంచి హైదరాబాద్ కు ఫ్లైట్ జర్నీ

ఏపీ పాలిసెట్ ఫలితాలు విడుదల.. 91.37 శాతం ఉత్తీర్ణత

షార్ట్ టైంలోనే భారీ సక్సెస్.. టీవీకే విజయ్‌పై పవన్ స్పందన ఇదే

తమిళనాడులో విజయ్ ప్రభంజనం.. దళపతికి చిరు, జగన్ ప్రత్యేక అభినందనలు

అరంగేట్రంలోనే అదరగొట్టిన విజయ్‌కు అభినందనలు: నారా లోకేశ్‌

AP : ఆ రెండు రాష్ట్రాల ఫలితాలు.. ఏపీ ముందస్తు హెచ్చరిక?

మోదీ నాయకత్వంపై ప్రజల విశ్వాసానికి ప్రతీక ఈ గెలుపు.. సీఎం చంద్రబాబు

Big Stories

Advertisement
×