E-Paper
Advertisement

Vande Bharat Express From Visakha : విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటినుండంటే..?

Vande Bharat Express From Visakha : విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటినుండంటే..?
Advertisement

Vande Bharat Express From Visakha : వందే భారత్ బులెట్ ట్రైన్ ఇక తెలుగు రాష్ట్రల్లో కూడా స్టార్ట్ కానుంది. ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని విశాఖలో బులెట్ ట్రైన్ సేవల గురించి ప్రస్థావించారు. గుజరాత్‌లో మొదలైన వందే భారత్ హైస్పీడ్ ట్రైన్ సేవలు క్రమక్రమంగా భారత్ మొత్తం విస్తరించనుంది. కొన్ని రోజుల ముందే దక్షిణ భారత్‌లో స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ నుంచి విజయవాడ మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సేవలు ప్రారంభించే యోచనలో ఉంది రైల్వే శాఖ. అయితే విశాఖ నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు నడపాలనే ప్రతిపాదన కూడా ఉంది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు వందే భారత్ సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 130 కిమీల వేగంతో వెళ్తుంది. విశాఖ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు. విశాఖ నుంచి సికింద్రబాద్‌కు కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. విశాఖ నుంచి వందే భారత్ ఎప్పటి నుంచి నడపాలనే దానిపైన ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఒక వందే భారత్ ట్రైన్‌లో 1300ల మందికి పైగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. చైర్ కార్‌కు రూ.1200, ఎక్జిక్యుటివ్ క్లాస్‌కు రూ.2295గా చార్జీలు ఉంటాయి.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×