E-Paper
Advertisement

Vande Bharat Express From Visakha : విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటినుండంటే..?

Vande Bharat Express From Visakha : విశాఖ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్.. ఎప్పటినుండంటే..?
Advertisement

Vande Bharat Express From Visakha : వందే భారత్ బులెట్ ట్రైన్ ఇక తెలుగు రాష్ట్రల్లో కూడా స్టార్ట్ కానుంది. ఇటీవల విశాఖ వచ్చిన ప్రధాని విశాఖలో బులెట్ ట్రైన్ సేవల గురించి ప్రస్థావించారు. గుజరాత్‌లో మొదలైన వందే భారత్ హైస్పీడ్ ట్రైన్ సేవలు క్రమక్రమంగా భారత్ మొత్తం విస్తరించనుంది. కొన్ని రోజుల ముందే దక్షిణ భారత్‌లో స్టార్ట్ అయింది. తెలుగు రాష్ట్రాల్లో విశాఖ నుంచి విజయవాడ మీదుగా వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సేవలు ప్రారంభించే యోచనలో ఉంది రైల్వే శాఖ. అయితే విశాఖ నుంచి విజయవాడ మీదుగా సికింద్రాబాద్ వరకు నడపాలనే ప్రతిపాదన కూడా ఉంది. విశాఖ నుంచి విజయవాడ మీదుగా తిరుపతి వరకు వందే భారత్ సేవలు అందించాలనే ప్రతిపాదన కూడా చేస్తున్నారు.

ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 130 కిమీల వేగంతో వెళ్తుంది. విశాఖ నుంచి విజయవాడకు కేవలం 4 గంటల్లో చేరుకోవచ్చు. విశాఖ నుంచి సికింద్రబాద్‌కు కేవలం 8 గంటల సమయం మాత్రమే పడుతుంది. విశాఖ నుంచి వందే భారత్ ఎప్పటి నుంచి నడపాలనే దానిపైన ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు. ఒక వందే భారత్ ట్రైన్‌లో 1300ల మందికి పైగా ప్రయాణించే వెసులుబాటు ఉంటుంది. ఇక టికెట్ ధరల విషయానికి వస్తే.. చైర్ కార్‌కు రూ.1200, ఎక్జిక్యుటివ్ క్లాస్‌కు రూ.2295గా చార్జీలు ఉంటాయి.

Related News

అధికారులపై సీఎం చంద్రబాబు సీరియస్.. 12 గంటలు కూర్చో లేకపోతే ఎలా? ఫోన్లు వద్దని ముందే..

విషం కక్కుతున్నారు.. వారిని అస్సలు వదిలిపెట్టం, జగన్‌కు లోకేష్ మాస్ వార్నింగ్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీ-తెలంగాణల్లో భారీ వర్షాలు, రాబోయే రెండురోజుల్లో..

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు, రికార్డు స్థాయిలో ఆదాయం

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ వద్ద ప్రమాదం.. తెగిపోయిన గేటు ఇనుప రోప్

సాయికృష్ణ కేసులో ట్విస్ట్.. అశోక్, వెంకటరాజు కస్టడీపై కోర్టు ఏం చెప్పిందంటే?

టీడీపీ పార్టీలో చేరాక తొలిసారి స్పందించిన చిన్న శ్రీను.. ఏమన్నారంటే?

బడికి పంపితే బానిస పనులా.. పిఠాపురం స్కూల్లో విద్యార్థులతో వెట్టిచాకిరీ కలకలం

Big Stories

Advertisement
×