Vijayasai Reddy: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రస్తుతం చేస్తున్నారు? వ్యవసాయంలో బిగా అయ్యారా? మిరపచెట్లకు పట్టిన చెదలను తొలగించేందుకు ఆయన స్ప్రే చేసే పనిలో నిమగ్నమయ్యారా? మరి ఆయన ఏ పార్టీలో చేరుతున్నారు? లేకుంటే పాత పార్టీలో చెదలు తొలగించిన తర్వాత రంగంలోకి దిగాలని భావిస్తున్నారా? ఇవే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.
విజయసాయిరెడ్డి 2.0 యాక్టివేట్
రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యవసాయంలో బిజీ అయ్యారు. ఒకప్పుడు విమానాల్లో తిరిగే ఆయన, ప్రస్తుతం వ్యవ‘సాయం’లో బిజీగా అయ్యారు. నెల్లూరు జిల్లా శంకరాపురంలో తన సొంత వ్యవసాయ క్షేత్రంలో సామాన్య రైతులా మారిపోయారు. సేంద్రియ వ్యవసాయం చేస్తూ రైతుగా మారిపోయి అందరినీ ఆశ్చర్య పరిచారు.
సేంద్రియ వ్యవసాయంలో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్న దృశ్యాలను ఆయన ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. అగ్నాస్త్రం తయారీకి గోవు మూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ములో వేసి బాగా కలియబెట్టారు. వాటిని మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆ తర్వాత చెదలు పట్టకుండా చెట్లకు స్ప్రే చేస్తున్నట్లు రాసుకొచ్చారు.
వ్యవసాయ క్షేత్రంలో మిరప చెట్లకు చెదలు తొలగింపు
ట్రెండ్కు తగ్గట్టుగా మారిపోయిన విజయసాయిరెడ్డి, పార్టీలోకి ఎప్పుడు రీఎంట్రీ అన్నది ప్రత్యర్థులు, సహచరుల నుంచి ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. పాత పార్టీలోకి మళ్లీ వెళ్తారా? లేకుంటే కషాయం వైపు చూస్తున్నారా? ఈ తరహా ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. వ్యవహారం మాదిరిగా పార్టీకి పట్టిన చెదలను ఎప్పుడు తొలగిస్తారంటూ ఎక్స్ వేదికగా ఆయన మద్దతుదారులు అడుగుతున్నారు.
కొద్దిరోజుల కిందట మీడియా ముందుకొచ్చిన విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఓవైపు అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూనే.. మరోవైపు ఫ్యాన్కి పట్టిన చెదలు తొలగించాలన్నారు. లేకుంటే ఆ పార్టీ కష్టమని తేల్చేశారు. ఆ విధంగా చేయకుంటే ఆ పార్టీ అధికారంలోకి రావడం కష్టమని చెప్పకనే చెప్పేశారు.
ALSO READ: బిగ్ అలర్ట్.. నేటి నుంచి వచ్చే 6 రోజులు వర్షాల మోత.. ఏ జిల్లాల్లో ఎక్కువంటే..
అదే సమయంలో వైసీపీ అధినేతను ఏ మాత్రం విమర్శలు చేయలేదు. కానీ పార్టీ మార్పుకు, అధికారంలోకి రావడానికి మాత్రం తన వంతు సలహాలు ఇచ్చారు. మిరప చెట్లకు చెదలు తొలగించిన మాదిరిగా ఫ్యాన్స్కు ఎప్పుడు చేస్తారంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. మరి సాయిరెడ్డి మనసులో ఏముందో ఎవరికి ఎరుక.
శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము. అగ్నాస్త్రం తయారీకి గోవుమూత్రం, నూరిన వేపాకులు, వెల్లుల్లి, మిరపకాయలు, పొగాకు ప్లాస్టిక్ డ్రమ్ము లో వేసి బాగా కలియబెట్టి, మరగపెట్టి 24 గంటలపాటు నిల్వవుంచి వడపోసి ఆపై చెట్లకు… pic.twitter.com/RE4uT47fMY
— Vijayasai Reddy V (@VSReddy_MP) March 16, 2026