E-Paper
Advertisement

Vijayawada: డ్రైనేజీలో గల్లంతైన బాలుడు దుర్మరణం.. ఈ పాపం ఎవరిది?

Vijayawada: డ్రైనేజీలో గల్లంతైన బాలుడు దుర్మరణం.. ఈ పాపం ఎవరిది?
Advertisement

Vijayawada: విజయవాడ అంటేనే మురుగు కాలువల నగరం. ఓవైపు కృష్ణా నది ప్రవహిస్తుంటే.. దానికి పోటీనా అన్నట్టు డ్రైనేజీలు పొర్లి పొంగుతుంటాయి. కొన్నిచోట్ల డ్రైనేజీలే.. కాలువలంత వెడల్పుగా ఉంటాయి. వాటిపైన ఎలాంటి పైకప్పు ఉండదు. గబ్బు వాసనతో ముక్కులు పగిలిపోవాల్సిందే. ఇలాంటి దారుణ పరిస్థితుల్లోనే ఎలాగోలా బతికేస్తుంటారు చాలామంది బెజవాడ వాసులు. కానీ, తాజాగా మరింత దారుణం జరిగింది. ఆ డ్రైనేజీ ఓ బాలుడిని మింగేసింది.

Advertisement

మధ్యాహ్నం నుంచి విజయవాడలో భారీ వర్షం కురిసింది. ఆ వానక మురుగు కాలువలన్నీ వరద నీటితో పొంగిపొర్లుతున్నాయి. ఆ సమీపంలో ఆడుకుంటున్న ఓ బాలుడు ప్రమాదవశాత్తు ఆ ఓపెన్ డ్రైనేజీలో పడిపోయాడు. కాలువ నిండుగా నీరు పారుతుండటంతో.. ఆ నీటి ఉధృతికి ఆ పిల్లాడు కొట్టుకుపోయాడు.

విజయవాడలోని గురునానక్ కాలనీలో జరిగిందీ దారుణం. ఆరేళ్ల అభిరామ్ ఓపెన్ డ్రైనేజీలో పడి గల్లంతయ్యాడు. అతని కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు, డీఆర్ఎఫ్, మున్సిపల్ సిబ్బంది. తమ బిడ్డ ఆచూకీ కోసం తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు బోరున విలపించారు.

Advertisement

గంటల తరబడి సెర్చ్ ఆపరేషన్ తర్వాత బాలుడి మృతదేహం కనిపించింది. ఆయుష్ ఆస్పత్రి సమీపంలో అభిరామ్ డెడ్‌బాడీని గుర్తించారు రెస్క్యూ టీమ్. తమ పిల్లాడు ప్రాణాలతో తిరిగొస్తాడని భావించిన ఆ కుటుంబానికి తీవ్ర విషాదమే మిగిలింది. అభి చనిపోయాడన్న వార్త తెలిసి కన్నీరు మున్నీరుగా రోధిస్తున్నారు.

బాలుడి మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపడుతున్నారు స్థానికులు. డ్రైనేజీలపై పైకప్పు వేయాలని.. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని నేతలు, అధికారులను ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదని ఆరోపిస్తున్నారు.

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×