E-Paper
Advertisement

Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త

Vijayawada: విజయవాడలో దారుణం: నర్సుగా పనిచేస్తున్న భార్యను కత్తితో పొడిచి చంపిన భర్త
Advertisement

Vijayawada: నగరంలో పట్టపగలే దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, మృతురాలు సరస్వతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఆమె ఆసుపత్రి నుంచి బయటకు రాగానే, అప్పటికే అక్కడ కాపుకాచిన భర్త విజయ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. భార్య పొట్టలో, మెడపై విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.

Advertisement

గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భర్త కోపం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సరస్వతి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 ఫిబ్రవరి 14న సరస్వతి, నిందితుడు విజయ్ ప్రేమ వివాహాం చేసుకున్నారు.  వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా సరస్వతి పని చేస్తుండగా.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విజయ్ పని చేస్తున్నాడు. భార్య వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గత కొన్ని రోజులుగా విజయ్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ సరస్వతిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

 

Related News

ట్రావెల్ బస్సు బోల్తా, హైదరాబాద్ టు బెంగుళూరు, స్పాట్‌లో 30 మంది

టీటీడీలో ఏసీబీకి చిక్కిన భారీ తిమింగలం.. డిప్యూటీ ఈవో లోకనాథం అరెస్ట్, విచారిస్తున్న అధికారులు

ఉత్తరాంధ్రకు గోదావరి నీళ్ల క్రెడిట్ వ్యవహారం, సీఎం చంద్రబాబు వర్సెస్ జగన్, అసలేం జరిగింది?

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

Big Stories

Advertisement
×