Vijayawada: నగరంలో పట్టపగలే దారుణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ భర్త తన భార్యను అందరూ చూస్తుండగానే కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
వివరాల్లోకి వెళితే, మృతురాలు సరస్వతి ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఆమె ఆసుపత్రి నుంచి బయటకు రాగానే, అప్పటికే అక్కడ కాపుకాచిన భర్త విజయ్ తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమెపై దాడి చేశాడు. భార్య పొట్టలో, మెడపై విచక్షణారహితంగా పొడవడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది.
గత కొంతకాలంగా ఈ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే భర్త కోపం పెంచుకుని ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని స్థానికులు చెబుతున్నారు. ఈ దారుణాన్ని చూసిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే అప్రమత్తమై ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడిని అక్కడే అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సరస్వతి హత్య ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. 2022 ఫిబ్రవరి 14న సరస్వతి, నిందితుడు విజయ్ ప్రేమ వివాహాం చేసుకున్నారు. వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా సరస్వతి పని చేస్తుండగా.. భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా విజయ్ పని చేస్తున్నాడు. భార్య వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని గత కొన్ని రోజులుగా విజయ్ అనుమానిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే విజయ్ సరస్వతిని దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు.
సరస్వతి హత్య ఘటనలో కీలక విషయాలు
2022 ఫిబ్రవరి 14న ప్రేమ వివాహాం చేసుకున్న సరస్వతి, నిందితుడు విజయ్
వీన్స్ ఆసుపత్రిలో స్టాఫ్ నర్స్ గా పని చేస్తున్న సరస్వతి
భవానిపురం శ్రేయాస్ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్న విజయ్
భార్య వేరే ఒకరితో వివాహేతర సంబంధం పెట్టుకుందని… https://t.co/RAPmN6UzCS pic.twitter.com/0p0uz8is3i
— ChotaNews App (@ChotaNewsApp) November 13, 2025