E-Paper
Advertisement

Swarupoonanda Swami: స్వరూపానంద ఎక్కడా? ఆ నగరాల మధ్య చక్కర్లు.. లెక్కల్లో తేడాలొచ్చాయా?

Swarupoonanda Swami: స్వరూపానంద ఎక్కడా? ఆ నగరాల మధ్య చక్కర్లు.. లెక్కల్లో తేడాలొచ్చాయా?

Swarupoonanda swami with jagan: శారదా పీఠం అధిపతి స్వరూపానంద స్వామి ఎక్కడ? గడిచిన ఐదేళ్లు ఓ వెలుగు వెలిగిన ఆయన, ఎందుకు కనిపించడం మానేశారు? మకాం మార్చేశారా? హైదరాబాద్, బెంగుళూరు మధ్య చక్కర్లు కొడుతున్నారు? లెక్కల్లో తేడాలొచ్చాయా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.

వైసీపీ హయాంలో ఓ వెలుగు వెలిగింది విశాఖలోని శారదా పీఠం. జగన్‌ను అధికారంలోకి తీసుకొచ్చేందుకు స్వారూపానంద స్వామి చేయని ప్రయత్నాలు లేవు. ప్రతీ నెలా వెళ్లి స్వామి ఆశీస్సులు తీసుకునే వారు అప్పటి సీఎం జగన్. ఆ విషయం కాసేపు పక్కన బెడదాం.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కసారి మాత్రమే మీడియా ముందుకొచ్చారు స్వరూపానంద. ఆ తర్వాత ఎక్కడున్నారో ఎవరికీ తెలీదు. కాకపోతే విశాఖ నుంచి హైదరాబాద్‌కు మకాం మార్చే ఆలోచన ఉన్నట్లు సూచన ప్రాయంగా చెప్పుకొచ్చారు. ఈ లెక్కన స్వామి విశాఖలో లేరన్నది కొందరి మాట.

ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్నారా? లేరా అన్న ప్రశ్నలు స్వామి భక్తులను వెంటాడుతున్నాయి. పొలిటికల్ సర్కిల్స్‌లో స్వామి గురించి మరో ఆసక్తికరమైన వార్త హంగామా చేస్తోంది. స్వరూపానంద స్వామి.. హైదరాబాద్ టు బెంగుళూరు మధ్య చక్కర్లు కొడుతున్నట్లు జోరుగా ప్రసారం సాగుతోంది. అందులో నిజమెంతో తెలీదు.

ALSO READ: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

వైసీపీ హయాంలో అందరి కంటే ఎక్కువగా లబ్ది పొందింది స్వరూపానందస్వామని అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు బలంగా చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి తక్కువ ధరకు భూములు, మరి కొన్నింటిని లీజుకు తీసుకున్న సందర్భాలున్నాయని చెబుతున్నారు.

తిరుమలలో జీ 3 కి పర్మీషన్ తీసుకుని స్వరూపానంద.. భారీగా నిర్మాణాలు చేపట్టారనే ప్రచారం సాగుతోంది. లడ్డూ వ్యవహారం వెలుగులోకి వచ్చాక స్వరూపానందస్వామిని కొందరు మీడియా మిత్రులు కలిసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన అందుబాటులోకి రాలేదు.

చాతుర్మాస దీక్షలో ఉన్నానని, తాను ఇప్పుడు మాట్లాడలేనని తప్పించుకునే ప్రయత్నం చేశారట స్వరూపానంద. బయట ప్రచారం జరుగుతున్నట్లు స్వరూపానంద.. హైదరాబాద్ టు బెంగుళూరుకు ఎందుకు చక్కర్లు కొడుతున్నారనే చర్చ జోరుగా సాగుతోంది.

గడిచిన ఐదేళ్లలో ప్రతీనెలా జగన్, శారదా పీఠం సందర్శించి లెక్కలు చూసుకునేవారని అంటున్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాడేపల్లి నుంచి యలహంకకు తిరేగస్తున్నారు జగన్. ఈ క్రమంలో జగన్‌ను బెంగుళూరులో స్వారూపానంద కలిసినట్టు వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. లెక్కలు తేల్చుకోవడం కోసమే వెళ్లారన్నది కొందరిమాట. మొత్తానికి స్వరూపానంద కనిపించకపోవడాన్ని భక్తులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Related News

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

పవన్ కళ్యాణ్ ‘సంకల్ప సభ’కు షాక్.. తెలంగాణ ప్రభుత్వం నో-పర్మిషన్!

Big Stories

×