BigTV English

Palle Panduga: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

Palle Panduga: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘పల్లె పండుగ’.. కంకిపాడుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!

Palle Panduga starts from today onwords: రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పల్లె పండుగ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు భూమి పూజ చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం సుమారు రూ.4,500 కోట్లు ఖర్చు చేస్తుండగా.. దాదాపు 30 వేల పనులను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది.


అన్నీ జిల్లాల్లో కలెక్టర్లు గ్రామసభల్లో ఆమోదించిన 30 వేల పనులకు సంబంధించి 3 వేల కి.మీ మేర సిమెంట్‌ రోడ్లకు ఇప్పటికే పరిపాలన అనుమతి మంజూరు చేశారు. సాంకేతిక ఆమోదం కోసం ఇంజనీర్లు అంచనాలు రూపొందిస్తున్నారు. అయితే డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ పెనమలూరు నియోజకవర్గం కంకిపాడులో జరిగే భూమిపూజలో పాల్గొంటారు.

Also Read: వాట్సాప్ గ్రూపుల్లో తప్పుడు ఆరోపణలపై మండిపడ్డ పులివర్తి సుధారెడ్డి…కఠిన చర్యలుంటాయని హెచ్చరిక


అదే విధంగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే షెడ్యూల్‌ ప్రకటించగా.. సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలకు పంచాయతీరాజ్‌శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ పల్లె పండుగ కార్యక్రమాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొనాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఐదేళ్ల పాటు వైసీపీ విధ్వంస పాలన కొనసాగిన తర్వాత మొట్టమొదటసారిగా చేపట్టనున్న ‘పల్లె పండుగ- పంచాయతీ వారోత్సవాల’ను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

Related News

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Pawan Kalyan project: పవన్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం.. కోట్లల్లో ఖర్చు.. ఎందుకంటే?

Big Stories

×