BigTV English
Advertisement

NTR, JAGAN : నాడు మల్లెల బాబ్జీకి ఎన్టీఆర్ క్షమాభిక్ష.. నేడు శ్రీనును జగన్ క్షమిస్తారా..?

NTR, JAGAN : నాడు మల్లెల బాబ్జీకి ఎన్టీఆర్ క్షమాభిక్ష.. నేడు శ్రీనును జగన్ క్షమిస్తారా..?

NTR, JAGAN : ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ పై మల్లెల బాబ్జి అనే దళిత యువకుడు దాడి చేశాడు. ఆయనపై చాకుతో దాడి చేశాడు. అప్పుడు ఎన్టీఆర్‌ స్వయంగా కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. బాబ్జికి క్షమాభిక్ష పెట్టమని అభ్యర్థించారు. దీంతో దాడి కేసు నుంచి మల్లెల బాబ్జీ బయట పడ్డాడు. కోడికత్తి కేసు విషయంలో నిందితుడు శ్రీనివాసరావు కూడా దళితుడే. ఈ కేసుపై మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.


కోడికత్తి కేసు నిందితుడు శ్రీను విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పందించాలని హర్షకుమార్ కోరారు. రాజమండ్రి కారాగారంలో తాను ఉన్నప్పుడు శ్రీను తరచూ తనను కలిసేవాడని తెలిపారు. ఎలాగైనా తాను రాసిన ఉత్తరం బయట పెట్టించండి. నా నిజాయతీ తెలుస్తుంది. నిజంగా జగన్‌ అభిమానిని. జగన్‌కు సింపతీ వస్తుందని.. ఆయన కుటుంబ సభ్యుడిగా గుర్తిస్తారనే దృష్టితోనే దాడి చేశానని చెప్పాడని హర్షకుమార్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

సీఎం జగన్ తీరుపై హర్షకుమార్ విమర్శలు చేశారు. నాడు ఎన్టీఆర్ మాదిరిగా జగన్‌ వ్యవహరించడంలేదని మండిపడ్డారు. సీఎం కోర్టుకు రావడానికి ఇష్టపడటం లేదన్నారు. మరోవైపు కుట్ర కోణంలో దర్యాప్తు చేయమంటున్న విషయాన్ని గుర్తు చేశారు. శ్రీను రాసిన లెటర్‌ను ఎన్‌ఐఏ తక్షణం బయట పెట్టాలని హర్షకుమార్ డిమాండ్ చేశారు. జగన్‌ కోర్టుకు వెళ్లి కోడి కత్తితో దాడి చేసిన శ్రీనివాసరావుకు క్షమాభిక్ష ప్రసాదించాలని హర్షకుమార్ కోరారు. మరి నాడు ఎన్టీఆర్ మాదిరిగా జగన్ నిర్ణయం తీసుకుంటారా..? కోర్టుకు హాజరై నిందితుడిని క్షమించేస్తారా..?


Related News

Tirumala Annadanam: అంబటి ప్రశంస.. భూమనకు ఝలక్

Top 20 News @ 9 PM: గ్రోత్ హబ్‌గా విశాఖ, కేటీఆర్‌కి వ్యతిరేఖంగా పోస్టర్స్

Spurious Ghee: కోటి సంతకాల సంగతి దేవుడెరుగు.. ముందు కల్తీ నెయ్యిలోనుంచి బయటపడేదెలా?

CM Chandrababu: మంత్రులకు సీఎం చంద్రబాబు బిగ్ టాస్క్.. ఇక తప్పు జరిగితే రెస్పాన్సిబిలిటీ మినిస్టర్లదే: సీఎం చంద్రబాబు

AP Cabinet Decisions: రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం.. మరిన్ని కీలక నిర్ణయాలు

Top 20 News @ 8 PM: కాంగ్రెస్ పార్టీపై హరీష్ రావు ఆరోపణలు, ఉపాధ్యాయుడు దాడి.. వినికిడి కోల్పోయిన విద్యార్ధి

Top 20 News @ 7 PM: ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిల్.. త్రిషా ఇంటికి బాంబు బెదిరింపు..!

Top 20 News @ 6 PM: అందెశ్రీ ఇక లేరు.. తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీం నోటీసులు.. నేటి టాప్ 20 న్యూస్ ఇవే!

Big Stories

×