BigTV English

KURNOOL: లాడ్జిలో మహిళ దారుణ హత్య.. వ్యక్తి ఆత్మహత్య.. కారణం?

KURNOOL: లాడ్జిలో మహిళ దారుణ హత్య.. వ్యక్తి ఆత్మహత్య.. కారణం?

Kurnool: వివాహేతర సంబంధం నేపథ్యంలో మహిళను హతమార్చి ఆపై ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన శనివారం ఉదయం కర్నూలు జిల్లా నందికొట్కూరులో జరిగింది. కర్నూలు త్రీ టౌన్ సీఐ మురళీధర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. నందికొట్కూరులో విజయ్ కూమార్(35) అనే వ్యక్తి హౌసింగ్ బోర్డు కాలనీలో నివాసం ఉంటూ ఓ ప్రైవేటు కంపేనీలో అకౌంటెంట్ ‌గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో రుక్సాన అనే మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారితీసింది. వీరి విషయం రుక్సాన కుటుంబంలో తెలియడంతో గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి.


ఈ నేపథ్యంలో శుక్రవారం విజయకుమార్ , రుక్సానాతో కలిసి కర్నూలులో ని ఓ లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నాడు. శనివారం ఉదయం ఎంత సేపటికీ గది తలుపులు తీయకపోవడంతో లాడ్జి సిబ్బందికి అనుమానం వచ్చి తలుపులు పగలగొట్టారు. గదిలో రుక్సానా, విజయ్ కుమార్ మృతి చెంది ఉన్నారు. మహిళ మృతదేహంపై కత్తిపోట్లు ఉండటంతో విజయకుమార్ మొదట ఆమెను కత్తితో పొడిచి.. తర్వాత అతను విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.


Related News

Auto Driver Sevalo Scheme: అక్టోబర్ 4న ఖాతాల్లో రూ.15 వేలు.. మరో పథకానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్

AP Assembly Coffee Issue: ఏపీ శాసనమండలిలో ‘కాఫీ’ రగడ.. ప్రజా సమస్యలే లేవా?

PM Modi AP Tour: ఏపీలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి కర్నూలులో భారీ ర్యాలీ

AP Legislative Council: ఏపీ శాసన మండలిలో వైసీపీ సభ్యుల నిరసన

AP Assembly: వాడెవడు.. వీడెవడు.. భగ్గుమన్న పాత పగలు.. చిరు VS బాలయ్య

Prakasam: రూ. 20 లక్షల కరెన్సీ నోట్లతో వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారు

Chandrababu: చంద్రబాబు ముందు చూపు.. ఎమ్మెల్యేలపై ఆగ్రహం అందుకేనా?

Tirumala Brahmotsavam 2025: తిరుమల బ్రహ్మోత్సవాలు.. ముత్యపు పందిరి వాహనంపై శ్రీవారు..

Big Stories

×