E-Paper
Advertisement

YCP News : రుషికొండపై సచివాలయ నిర్మాణం.. వైసీపీ క్లారిటీ..

YCP News : రుషికొండపై సచివాలయ నిర్మాణం.. వైసీపీ క్లారిటీ..
YCP News

YCP News (Latest news in Andhra Pradesh) : విశాఖపట్నం రుషికొండ కొంతకాలంగా ఏపీలో హాట్ టాపిక్ గా ఉంది. ఈ కొండపై ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టడంతో వివాదం మొదలైంది. వైసీపీ ప్రభుత్వం ప్రకృతిని విధ్వంసం చేస్తోందంటూ టీడీపీ, జనసేన విమర్శలు గుప్పించాయి. శనివారం వైసీపీ అధికారిక ఖాతా నుంచి చేసిన ఓ ట్వీట్ పెను దుమారాన్ని రేపింది.

ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు విశాఖను పరిపాలనా రాజధానిగా జగన్ ప్రకటించారని శనివారం చేసిన ట్వీట్ లో వైసీపీ పేర్కొంది. రుషికొండపై సచివాలయం నిర్మిస్తున్నారని తెలిపింది. దానిపై కూడా టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని మండిపడింది. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందటం ఆ పార్టీకి ఇష్టం లేదనిపిస్తోందని ఆ ట్వీట్‌లో విమర్శించింది. అయితే ఆదివారం వైసీపీ మరో ట్విస్ట్ ఇచ్చింది.

శనివారం రాత్రి చేసిన ట్వీట్‌ను వైసీపీ డిలీట్‌ చేసింది. రుషికొండపై సెక్రటేరియట్ నిర్మాణం జరుగుతోందని పొరపాటున ట్వీట్ చేశామని వివరణ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం టూరిజం శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు జరుగుతున్నాయని వైసీపీ తాజాగా ట్వీట్ చేసింది.

రుషికొండపై చేపడుతున్న నిర్మాణాలపై వైసీపీ ఒక్కరోజులోనే మాట మార్చిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ సచివాలయం నిర్మిస్తున్నారని వైసీపీ ట్వీట్ చేసిన వెంటనే విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ పార్టీ వెనక్కి తగ్గిందని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.

Related News

వైసీపీలో గుబులు మొదలు.. తిరుమల కల్తీ నెయ్యి కేసు, ఆరు రాష్ట్రాల్లో ఈడీ దాడులు, రూ. 60 లక్షలు సీజ్

Tirumala Laddu: తిరుమలలో గత లడ్డూ రికార్డు బద్దలు.. ఒక్క మే నెలలోనే ఇన్ని కోట్ల విక్రయాలా..?

రష్యాలో బిజీగా మంత్రి లోకేష్.. మాస్కోలో స్బేర్‌ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌తో భేటీ, టెక్నాలజీపై ఫోకస్

ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?.. కూటమి సర్కార్‌ను కడిగిపారేసిన రాచమల్లు!

Lakshmi Parvathi: 2024 ఎన్నికల్లో వైఎస్ జగన్ ఓడిపోలేదు: నందమూరి లక్ష్మీపార్వతి!

రీల్ కాదు రియల్.. బాలయ్యను మరిపించిన సీఎం చంద్రబాబు, ఇదిగో వీడియో

వైఎస్ రాజారెడ్డి.. కళ్లకు కట్టినట్టు చూపించారు, వీడియో వైరల్

పవన్ కళ్యాణ్‌పై యాంకర్ శ్యామల ఘాటు వ్యాఖ్యలు.. ‘పీపీపీ’ అంటూ వ్యంగ్యాస్త్రాలు!

Big Stories

×