BigTV English

Chandrababu Latest News : రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ.. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు..

Chandrababu Latest News : రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ.. వైసీపీ ప్రభుత్వంపై ఫిర్యాదు..

Chandrababu Latest News (AP Political News) : ఏపీలో ఎన్నికలకు మరో 8 నెలల సమయం మాత్రమే ఉంది. ప్రభుత్వం విధానాలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రాష్ట్రంలో హింస, నిరంకుశ పాలన, అరాచకాలను జరుగుతున్నాయని ఆరోపిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీకి తాజాగా లేఖ రాశారు. తనపై దాడులు జరిగిన ఘటనలపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. ప్రణాళిక ప్రకారమే ప్రభుత్వ ప్రోత్సాహంతోనే తనపై దాడులు జరగుతున్నాయని ఆరోపించారు.


తనకున్న విశేషాధికారాలతో ఏపీలో పరిస్థితులపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జోక్యం చేసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో తీవ్రమైన, అసాధారణ పరిస్థితులు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతున్నాయని ఆరోపించారు.

రాష్ట్రంలో రాజ్యాంగ సంస్థలను విధ్వంసం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెడుతున్నారని లేఖలో వివరించారు. న్యాయ, కేంద్ర సంస్థలపై దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ 9 పేజీల లేఖను రాశారు. పలు ఘటనలకు సంబంధించి 75 పేజీల అనుబంధ డాక్యుమెంట్‌ను కూడా చంద్రబాబు జత చేశారు.


రాష్ట్రపతి, ప్రధానికి చంద్రబాబు లేఖ రాయడం ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచింది. ఇప్పటికే టీడీపీ అధినేత రాష్ట్రవ్యాప్తంగా వరుస పర్యటనలు చేస్తున్నారు. ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. అభివృద్ధి ఎజెండాను ప్రజల ముందుపెడుతున్నారు. ఏపీ అభివృద్ధి తనతోనే సాధ్యమంటున్నారు. మరోవైపు వైసీపీ పాలనపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రాష్ట్రపతి, ప్రధానికి లేఖ రాసి జగన్ సర్కార్ పై మరో అస్త్రాన్ని సంధించారు.

Related News

AP Power Charges: ఏపీ వాసులకు గుడ్ న్యూస్.. నవంబర్ నుంచి తగ్గనున్న విద్యుత్ బిల్లులు

Tirumala Garuda Seva: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. అంగరంగ వైభవంగా శ్రీవారి గరుడ సేవ

GST Relief To Farmers: జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీ ఊరట.. వేటిపై ధరలు తగ్గనున్నాయంటే?

AP Weather: అక్టోబర్ 1 నాటికి మరో అల్పపీడనం.. రేపు ఈ జిల్లాల్లో వర్షాలు.. ప్రాజెక్టుల్లో వరద ప్రవాహాలు

Gudivada Amarnath: కళ్ళు ఆర్పకుండా అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు దిట్ట: గుడివాడ అమర్నాథ్

AP Fee Reimbursement: పండుగ వేళ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.394 కోట్లు విడుదల

Vijayawada Traffic Diversions: మూల నక్షత్రంలో సరస్వతిదేవిగా దుర్గమ్మ దర్శనం.. రేపు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు

CM Chandrababu Meets Pawan: డిప్యూటీ సీఎం నివాసానికి సీఎం చంద్రబాబు.. ఉత్కంఠగా మారిన భేటీ?

Big Stories

×