E-Paper
Advertisement

YS Jagan Mohan Reddy: చెన్నైలో జగన్ సందడి.. వివాహ వేడుకలో సూర్య, కార్తీలతో..!

YS Jagan Mohan Reddy: చెన్నైలో జగన్ సందడి.. వివాహ వేడుకలో సూర్య, కార్తీలతో..!
Advertisement

YS Jagan Mohan Reddy: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెన్నై నగరంలో ప‌ర్య‌టించారు. తన సమీప బంధువుల వివాహ వేడుకలో పాల్గొన్నారు. చెన్నై చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు, అభిమానులు ఘనస్వాగతం పలికారు..

వైఎస్ జగన్ పెదనాన్న వైఎస్ జార్జి రెడ్డి కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి నివాసంలో ఈ వివాహ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. అనిల్ రెడ్డి కుమారుడు సాహిల్, వేదికల కళ్యాణ ఘట్టాన్ని చూడటానికి జగన్ స్వయంగా తరలివచ్చారు. ఈ వేడుకలో ఏపీ మాజీ సీఎం ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆయన్ని చూసేందుకు భారీగా తరలివచ్చిన అభిమానులు, కార్యకర్తల కోలాహలంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. కుటుంబ సభ్యులతో కలిసి జగన్ ఈ వేడుకను ఆస్వాదించారు.

Advertisement

ఈ వివాహ వేడుకకు కోలీవుడ్ స్టార్ హీరోలు సూర్య, కార్తీ హాజరుకావడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సాంప్రదాయ పట్టు పంచె, షర్ట్ ధరించి వచ్చిన సూర్యను చూడగానే జగన్ సాదరంగా ఆహ్వానించారు. సూర్య తన తమ్ముడు కార్తీని జగన్‌కు పరిచయం చేయగా, జగన్ వారిద్దరినీ ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. జగన్, సూర్యల మధ్య పాత స్నేహం ఉండటంతో వారిద్దరూ పక్కపక్కనే కూర్చుని సరదాగా ముచ్చటించారు. ఈ స్టార్ బ్రదర్స్ మరియు అగ్ర నాయకుడి కలయిక చూసి అక్కడి వారు ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement

అంతేకాకుండా, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కూడా ఈ వేడుకలో సందడి చేశారు. ఒకే వేదికపై వైఎస్ జగన్, మోహన్ బాబు పక్కపక్కనే ఉన్న వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. రాజకీయాల్లో కీలక నేత, సినీ రంగంలో అగ్ర నటుడు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అటు రాజకీయ వర్గాల్లోనూ, ఇటు సినీ అభిమానుల్లోనూ ఆసక్తికర చర్చ మొదలైంది.

Read Also: Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!

Related News

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

ఎట్టకేలకు ముహూర్తం ఖరారు.. భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్, ప్రధాని మోదీ చేతుల మీదుగా, కాకపోతే

ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..

Big Stories

Advertisement
×