E-Paper
Advertisement

YS Jagan Mohan Reddy : ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్..

YS Jagan Mohan Reddy : ఘనంగా ముఖ్యమంత్రి జగన్ జన్మదిన వేడుకలు.. ట్విట్టర్‌ ట్రెండింగ్‌లో టాప్..
Advertisement

YS Jagan Mohan Reddy : ఆంధ్రప్రేదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. రాజకీయ ప్రముఖులు, సెలబ్రటీలు సీఎం జగన్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు క్యాంప్ ఆఫీసుకు నేరుగా వెళ్లి సీఎంకు పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు చెబుతున్నారు. టాలీవుడ్ కింక్ నాగార్జున ట్విట్టర్‌లో “ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి గారు మీకు జన్మదిన శుభాకాంక్షలు..మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా” అని అన్నారు.

కోలీవుడ్ స్టార్ విశాల్ కూడా ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ” ముఖ్యమంత్రి జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు.. మీకు భగవంతుని ఆశిస్సులు ఉండాలని కోరుకుంటున్నా” అని విశాల్ ట్వీట్ చేశారు.

Advertisement

ముఖ్యమంత్రి జగన్‌ను ట్విట్టర్‌లో జన్మదిన శాభాకాంక్షలు వెల్లువలా వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. దేశ విదేశాల నుంచి అనేక మంది ప్రముఖులు, సెలబ్రెటీలు సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రస్తుతం దేశంలో #HBDYSjagan హ్యాష్‌టాగ్ ట్రెండింగ్‌లో ఉంది. మామూలుగా సినీ తారల జన్మదిన వేడుకలు ట్విట్టర్‌లో టాప్‌లో ట్రెండింగ్ అవుతాయి.. ముఖ్యమంత్రి జగన్ బర్త్‌డే విషస్ టాప్‌లో ట్రెండ్ అవడం విశేషం. ఇప్పటికే 5లక్షలకు పైగా ట్వీట్లతో టాప్ ప్లేస్‌లో ఉంది #HBDYSjagan హ్యాష్‌టాగ్.

తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జన్మదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయంలోనే ఉండడంతో అక్కడ వాతావరణం అట్టహాసంగా మారింది. వేదపండితులు సీఎం జగన్‌ను ఆశీర్వదించారు.

Advertisement

ఉన్నతాధికారులు, మంత్రులు సీఎంకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేశారు ముఖ్యమంత్రి. రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజులపాటు సీఎం జగన్ జన్మదిన వేడుకలు జరపాలని వైసీపీ పార్టీ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×