BigTV English
Advertisement

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్

YS Jagan Tadepalli Palace: తాడేపల్లి ప్యాలెస్‌.. జురాసిక్ పార్క్? ఇంతకీ ఎవరా దొంగ పిల్లి? టీడీపీ యానిమేషన్ స్టోరీ వైరల్

YS Jagan Tadepalli Palace: రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. అయినా వారి అలవాట్లు ఇప్పటి నేతలు కంటిన్యూ చేస్తున్నారు. రాజకీయాల్లో ఈ పోకడ మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇంకా కంటిన్యూ అవుతున్నాయి కూడా. ప్రజల డబ్బును నేతలు ఎలా దుర్వినియోగం చేస్తున్నారో చెప్పేందుకు ఇదొక ఎగ్జాంఫుల్.


పూర్వం రాజులు తమ ఇల్లు శత్రువులకు కనిపించకుండా పొడవైన గొడలు కట్టేశారు. ఎవరొచ్చినా, ఏం చేసినా బయటకు కనిపించేది కాదు. వాటి ఆనవాళ్లు ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఏపీలో రాజుల పద్దతినే మన నాయకులు ఫాలో అవుతున్నారు. తాడేపల్లి మాజీ సీఎం జగన్‌ ప్యాలెస్‌కు  సంబంధించి కొత్త కొత్త విషయాలు బయట పెడుతోంది చంద్రబాబు సర్కార్.

2019 వైసీపీ అధికారంలోకి రాగానే తాడేపల్లి ప్యాలెస్‌కు మరమ్మతులు చేసింది.  ప్రభుత్వం మనదేకదా.. అడిగేవారు ఎవరున్నారని భావించారు ఆనాటి పెద్దలు.  ఏకంగా 12.85 కోట్ల రూపాయలతో పనులు చేయించారు. ప్యాలెస్ లోపల విషయం కాసేపు పక్కనపెడదాం.


మాజీ సీఎం జగన్ ప్యాలెస్ చుట్టూ ఐరన్ పెన్సింగ్ నిర్మించారు. ఇంటికి నాలుగు వైపులా 30 అడుగుల ఎత్తైన పెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీని విలువ అక్షరాలా 12 కోట్ల పైమాటే. ఈ విషయాన్ని  ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలతో సహా బయటపెట్టింది చంద్రబాబు సర్కార్.

ALSO READ: నెక్ట్స్ టార్గెట్ జగన్.. సజ్జల జస్ట్ శాంపిల్, వైసీపీని వణికిస్తున్న చంద్రబాబు ప్లాన్

ఒకవిధంగా చెప్పుకోవాలంటే అదంతా ప్రజాధనం. కంచెకి క‌రెంటు స‌ర‌ఫ‌రా కూడా ఉంద‌ట‌. గడిచిన ఐదేళ్లు ప్యాలెస్ వైపు ఎవరు చూడకుండా ఉండేలా రోడ్లను సైతం బ్లాక్ చేసింది అప్పటి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నిబంధనలను తొలగించింది.

జగన్ క్యాంప్ ఆఫీసు ఫర్నీచర్ విషయంలో ప్రభుత్వానికి డబ్బులు ఇస్తామని చెప్పారు ఆ పార్టీ నేతలు. కంచె నిర్మాణానికి సంబంధించిన నిధులను ప్రభుత్వ ఖజానాకు ఆ పార్టీ జమ చేస్తుందా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.

తాడేపల్లి ప్యాలెస్‌ కంచెకు సంబంధించి ఓ నిమిషం నిడివి గల యానిమేషన్ వీడియోను విడుదల చేసింది టీడీపీ. దొంగ పిల్లి కథతో భావి తరాలకు అర్థమయ్యేలా ప్యాలెస్ కంచె గురించి బాధ్యత గల తండ్రి, తన కొడుకును ఆ రోడ్డపై తీసుకుంటూ వివరించే ప్రయత్నం చేశాడు.

 

Related News

CM Chandrababu: 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. కారణం ఇదే

Pawan Kalyan: ఎర్రచందనం గోదామును పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. అడవిలో కాలినడకన ప్రయాణం

CM Chandrababu: ప్రపంచమంతా వైజాగ్ వైపు చూస్తోంది.. భారీ పెట్టుబడులు రావడం శుభపరిణామం: సీఎం చంద్రబాబు

Visakhapatnam: విశాఖలో సీఐఐ సదస్సుకు భారీ ఏర్పాట్లు.. 40 కోట్లతో సర్వాంగ సుందరంగా పనులు

Visakhapatnam Incident: అమ్మా నా కోడలా.. దొంగ పోలీస్ ఆట ఆడి.. అత్తను ఎలా లేపేసిందంటే..!

APSRTC Google Maps: గూగుల్ మ్యాప్స్ లో ఏపీఎస్ఆర్టీసీ సేవలు.. బస్ టికెట్లు బుకింగ్ ఇకపై ఈజీ

AP Ration Card eKYC: ఏపీలో రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. వెంటనే ఇలా చేయకపోతే కార్డు రద్దు.. స్టేటస్ ఇలా చెక్ చేసుకోవచ్చు

Tirumala: డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం.. త్వరలోనే టికెట్లు జారీ: టీటీడీ ఈవో

Big Stories

×