E-Paper
Advertisement

Sharmila on YSR Statues: వైఎస్సార్ విగ్ర‌హాలు ధ్వంసం.. ష‌ర్మిల ఫైర్‌..!

Sharmila on YSR Statues:  వైఎస్సార్ విగ్ర‌హాలు ధ్వంసం.. ష‌ర్మిల ఫైర్‌..!
Advertisement

YS Sharmila Serious on YSR Statues: ఏపీలో దివంగత నేత మాజీ సీఎం వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న దాడులను రాష్ట్ర పీసీసీ చీఫ్ షర్మిల తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. రాష్ట్రంలో మహానేత వైఎస్సార్ విగ్రహాలపై అల్లరి మూకలు చేస్తున్న వికృత దాడులను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి అరాచకాలు జరగడం అత్యంత దారుణం. ఎటువంటి పరిస్థితిలోనూ ఇలాంటి రౌడీ చర్యలు ఖండించి తీరాల్సిందే అన్నారు.

ఇది పిరికిపందల చర్య తప్ప మరొకటి కాదు. తెలుగు వారి గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకుడు.. ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ముద్ర.. అటువంటి నేతకు నీచ రాజకీయాలు ఆపాదించడం సరికాదు. గెలుపు, ఓటములు ఆపాదించడం కూడా సరికాదు.. వైఎస్సార్ ను అవమానించేలా ఉన్న ఈ సంఘటనలు హీనమైనవి. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి అని ట్వీట్ చేశారు.

Advertisement

ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లిలో వైఎస్సార్ విగ్రహానికి గురువారం అర్థరాత్రి నిప్పు పెట్టారు. పొగ రావడం గమనించిన స్థానికులు నీళ్లు పోసి మంటలను ఆర్పి వేసారు. అయితే అంతకు ముందు వారు విగ్రహానికి తాళ్లు కట్టి ట్రాక్టర్‌తో లాగి కూల్చేయడానికి ప్రయత్నించారు.

Related News

అనితకు క్షమాపణ చెప్పేది లేదు.. గుంటూరులో అంబటి రాంబాబు హాట్ కామెంట్స్!

రూ.1000 కోట్ల ఆస్తి.. వేలాది కుటుంబాల ఇళ్ల కల నెరవేర్చిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌కి దక్కిన అరుదైన గౌరవం.. బెస్ట్ వెడ్డింగ్ డెస్టినేషన్‌గా ఏపీకి అంతర్జాతీయ అవార్డు

ఈసారి దక్షిణాది వంతు.. అల్పపీడనం సంకేతాలు, వారం పాటు వర్షాలు కుమ్ముడే కుమ్ముడు

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

Big Stories

Advertisement
×