E-Paper
Advertisement

AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..

AP News: దుప్పిని చంపి.. వండుకు తిన్న వైసీపీ నేతలు!.. ఏపీలో కలకలం..
Advertisement

AP News: అధికార వైసీపీ నేతలు చుక్కల దుప్పిని చంపి విందు చేసుకున్న ఘటన తిరుపతి జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. దారి తప్పి జనారణ్యంలోకి వచ్చిన ఓ దుప్పి నేతలకు ఆహారమైంది.

అరుదైన చుక్కల దుప్పిని చంపి ఆరగించిన సంఘటన యర్రవారిపాలెం మండలం వీఆర్ అగ్రహారంలో చోటుచేసుకుంది. శేషాచల అటవీ ప్రాంతం నుంచి దుప్పి గ్రామంలోకి వచ్చి చేరింది. పంటపొలాల్లో సంచరిస్తుండగా గమనించిన వైసీపీ కార్యకర్తలు.. కుక్కతో దాడి చేయించి చంపేశారు. ఆ తర్వాత దుప్పి మాంసంతో విందు చేసుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

దుప్పిని పట్టుకుంటున్న సమయంలో తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వ్యవహారం బయటకొచ్చింది. ఆ వీడియో ఆధారంగా నిందితులను తేల్చే పనిలో పడ్డారు ఫారెస్ట్ అధికారులు. ఇప్పటికే ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. నిందితులు వైసీపీకి చెందిన మాజీ సర్పంచి చంద్ర, కృష్ణయ్య, నాగేశ్వరరావు, చిన్నబ్బ లతో పాటు పలువురు మహిళలు కూడా ఉన్నట్టు గుర్తించారు.

Related News

జాబ్స్ అడిగితే కేసులా బాబు? ఇదేం దారుణం: జగన్ ఫైర్

బొత్స ఫ్యామిలీకి బిగ్ షాక్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలోకి చిన్న శ్రీను

ఏపీకి భారీ వర్ష గండం.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ

సీనియర్ ఎన్టీఆర్, చిరంజీవిపై పోస్టులా.. జనసైనికులకు పవన్ కళ్యాణ్ వార్నింగ్!

ఆంధ్రప్రదేశ్ హస్తకళాకారులకు పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్!

మెగా డీఎస్సీ కాదు.. అది దగా డీఎస్సీ.. కూటమి ప్రభుత్వంపై బొత్స ఫైర్!

మెగాస్టార్ చిరంజీవి ఇంటికి మ‌రో ప‌ద‌వి.. ఈసారి కూతురు సుస్మిత‌ వంతు, దుర్గగుడి బోర్డులో ప్రత్యేక పదవి

పార్టీ కేడర్‌కు టీడీపీ-జనసేన పార్టీలు వార్నింగ్.. రిపీట్ చేస్తే ఊరుకునేది లేదు

Big Stories

Advertisement
×