E-Paper
Advertisement

YSRCP On TDP Drugs Mafia: తుస్సు మన్న వైసీపీ బిగ్ రివీల్, దీనికే అంత బిల్డప్పా?

YSRCP On TDP Drugs Mafia: తుస్సు మన్న వైసీపీ బిగ్ రివీల్, దీనికే అంత బిల్డప్పా?
Advertisement

YSRCP On TDP Drugs Mafia: పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు‌‌గా కనిపిస్తోంది వైసీపీ చేష్టలు. టీడీపీ బిగ్ బ్రేకింగ్ అంటూ ప్రకటించిన కొద్దిసేపటికే, ఆ థీమ్‌ని కాపీ కొట్టేసింది వైసీపీ. గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆ విషయాన్ని రివీల్ చేసింది వైసీపీ. తీరా వైసీపీ పెట్టిన బిగ్ రివీల్ చూసిన తర్వాత తుస్సు మంది.. కార్యకర్తలను ఉసూరు మనిపించింది.

అధికారంలో ఉన్నవారి దగ్గర ఎంతో కొంత సమాచారం ఉంటుంది. టీడీపీ దగ్గరున్న సమాచారం మేరకు..  బుధవారం రాత్రి ఎనిమిదన్నర గంటలకు వైఎస్ షర్మిల.. జగన్‌కు రాసిన లేఖను బయటపెట్టింది. ఒక విధంగా అదొక సంచలనం. అంతర్గతంగా ఏం జరిగింది? వైఎస్ఆర్ ఆస్తుల పంపకాల విషయంలో జరుగుతోందన్నది ఆ లేఖ ద్వారానే బయట ప్రపంచానికి తెలిసింది.

Advertisement

వైసీపీ బిగ్ రివీల్ విషయానికొద్దాం. అంతా గాసిప్స్ మాదిరిగా వెల్లడించింది. తాము ఇచ్చిన సమాచారం వంద శాతం కరెక్ట్ అని చెప్పలేకపోయింది. చాలా వరకు వాటిని బ్లర్ చేసింది. మీడియా ముసుగు వేసుకుని డ్రగ్స్ మాఫియా నడిపే వారికి టీటీడీ ఛైర్మన్ పదవులా అంటూ ప్రశ్నించింది.

కొన్నాళ్లుగా 15 మంది డ్రగ్స్ వినియోగదారులతో రెగ్యులర్‌గా వ్యవహారాలు నడుపుతున్నారని, దాని వెనుక ఎల్లో న్యూస్ ఛానెల్ అధినేత అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. క్లారిటీ లేకుండా బిగ్ రివీల్ అంటూ చెప్పుకోవడం దేనికంటూ అప్పుడే సోషల్ మీడియాలో వైసీపీపై కౌంటర్లు పడిపోతున్నాయి.

Advertisement

ALSO READ: విజయనగరంలో జగన్, డయేరియా బాధితులకు పరామర్శ

ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో పరువు నష్ట దావా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని వైసీపీ.. డ్రగ్స్‌కు సంబంధించిన ఆయా వ్యక్తుల పేర్లు బయట పెట్టలేదని కొందరు అంటున్నారు. వైసీపీ హయాంలో విశాఖ పోర్టులో కంటెయినర్ల వ్యవహారం బయటపడింది. దాని సమాచారం ఏందన్నది కొందరి ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. బిగ్ రివీల్ ఏమోగానీ.. వైసీపీ దీంతో మరింత చులకనైపోయిందనే టాక్ జోరుగా సాగుతోంది.

 

Related News

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కోడుకును చున్నీతో గొంతు నులిమి.. అతిదారుణంగా చంపిన తల్లి!

విహారయాత్రలో ఘోర విషాదం.. సముద్ర స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు మృతి!

SVIMS Admissions: తిరుపతి స్విమ్స్‌లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల!

Sai Krishna Lockup Death: సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ కేసు.. నేడు కర్మకాండల వేళ ఊహించని ట్విస్ట్!

AP AEE Recruitment: ఏఈఈ పరీక్షలకు డేట్స్ ఫిక్స్.. సోషల్ మీడియా ఫేక్ ప్రచారాలపై ఏపీ ట్రాన్స్‌కో ఫైర్!

చంద్రబాబు, జగన్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యం- సీపీఎం

తిరుమల ఘాట్ రోడ్డులో ఘోర ప్రమాదం.. బోల్తా పడ్డ కారు.. స్పాట్‌లో!

Big Stories

Advertisement
×