AI Impact: ఇండియన్ ఐటీ సెక్టార్లో బిగ్ ఛేంజ్ కనిపిస్తోంది. ఏఐ ఎఫెక్ట్తో ఫ్రెషర్ల రిక్రూట్మెంట్ పాలసీనే మారిపోయింది. 13 శాతం వరకు నియామకాలు తగ్గిపోయాయ్. పెద్ద ఐటీ కంపెనీలన్నీ ఇప్పుడు స్కిల్డ్ బేస్డ్గానే అభ్యర్థులను ఎంచుకుంటున్నాయ్. ఫ్రెషర్ల ఆన్బోర్డింగ్ లేట్ చేసే ధోరణి పెరుగుతోంది. ప్రాజెక్ట్లు, బిజినెస్ అవసరాలని బట్టే జాయినింగ్స్ ఉంటాయని క్లియర్గా చెప్పేశాయ్. దాంతో.. చాలా మంది భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై గందరగోళంలో పడ్డారు. దేశంలోని ఐదు టాప్ ఐటీ కంపెనీలు.. 2025లో 12 వేల మందికి కొత్త ఉద్యోగాలివ్వగా.. ఈ ఏడాది 7 వేలకు తగ్గించేశాయ్. నెక్ట్స్ ఇయర్ ఈ కౌంట్ ఇంకాస్త తగ్గనుంది. దీనివల్ల.. చాలా మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు పని మొదలుపెట్టేందుకు.. నెలల తరబడి ఆగాల్సి వస్తోంది. ఏఐ రాకముందు.. బెంచ్ స్ట్రెంత్ పెంచుకునేందుకు వేలాది మంది ఫ్రెషర్లను రిక్రూట్ చేసుకునేవారు. ఇప్పుడు నియామకాల విధానం పూర్తిగా ప్రాజెక్ట్, డిమాండ్ బేస్డ్గా మారిపోయిందని.. మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు.. ఇంజనీరింగ్ విద్య వేస్ట్ అనే కామెంట్ నిజమవుతోందా?