Gen Z: మొన్నటి వరకు జెన్జీలంటే.. యంగ్ టాలెంట్ అని, షార్ప్ బ్రెయిన్ అని ఉద్యోగాలిచ్చిన కంపెనీలు.. ఇప్పుడు తమ ఆలోచనలను మార్చుకుంటున్నాయి. వారికి ఉద్యోగాలివ్వాలా? వద్దా? అనేదే కార్పొరేట్ కంపెనీల్లో హాట్ డిబేట్. సోషల్ మీడియాలో పోస్టులు, రోడ్డెక్కి చేసే ప్రొటెస్ట్లు మేనేజ్మెంట్ల ఆలోచనను పూర్తిగా మార్చేస్తున్నాయి. ఆఫీస్ టైమింగ్స్ అయిపోయాక వీళ్లు పౌరులుగా చేసే పోరాటాలు.. ఆఫీస్ లో హెచ్ఆర్లకు పెద్ద తలనొప్పిగా మారుతున్నాయి.
జంతర్మంతర్ నిరసనతో జెన్జీ సత్తా ఏంటో దేశానికి అర్థం అయింది. ఆందోళనలు ముగిసిన తర్వాత కొంత మందికి ఆఫీసులో చప్పట్లతో స్వాగతం లభిస్తే.. మరికొందరికి మాత్రం మేనేజర్ల నుంచి పొలిటికల్ లెక్చర్లు తప్పడం లేదట. కారణం.. జెన్జీల ఎక్స్ట్రా యారోగెన్సే కారణం అంటున్నారు.
ఇదివరకు ఆఫీస్ అయిపోయాక ఉద్యోగులు ఏం చేసినా కంపెనీలు పట్టించుకునేవి కావు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతి పోస్ట్పై ఓ లుక్కెస్తున్నారు. అక్కడేమైనా తప్పుగా మాట్లాడితే.. మొత్తం కంపెనీకి చెడ్డపేరు వస్తుందనే భయం. దీంతో కొన్ని కంపెనీలు ముందు జాగ్రత్తగా.. నిరసనల్లో పాల్గొనద్దని కోడ్ ఆఫ్ కండక్ట్, సోషల్ మీడియా పాలసీల రూపంలో ఆంక్షలు అమలు చేస్తున్నారు.
Also Read: ప్రధాని మోదీ పోస్టుల వివాదం.. డీసీపీ అరవింద్ బాబుపై వేటు!