E-Paper
Advertisement

Rahul Gandhi: జోడో యాత్రకు బాంబు బెదిరింపు.. రాహుల్ భద్రత పెంపు..

Rahul Gandhi: జోడో యాత్రకు బాంబు బెదిరింపు.. రాహుల్ భద్రత పెంపు..

Rahul Gandhi: భారత్ జోడో యాత్ర ఫుల్ జోష్ తో సాగుతోంది. పాదయాత్రతో రాహుల్ గాంధీకి మరింత మైలేజ్ వస్తోంది. జోడో యాత్రతో కాంగ్రెస్ కేడర్ లో ఉత్సాహం రెట్టింపవుతోంది. రాహుల్ ఏ ప్రాంతానికి వెళితే ఆ ప్రాంతంలో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇలాంటి సమయంలో భారత్ జోడో యాత్రకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ కు వస్తే బాంబు పేలుళ్లకు పాల్పడతామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఆ లేఖలో హెచ్చరించడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. జోడో యాత్రకు బాంబు బెదిరింపులు రావడానికి సావర్కర్ వివాదమే కారణమా? అని అనుమానిస్తున్నారు.

మహారాష్ట్రలో జరుగుతున్న యాత్రలో రాహుల్ గాంధీ సావర్కర్ పై సంచలన వ్యాఖ్యలు చేయడంతో వివాదం రాజుకుంది. సావర్కర్ బ్రిటిష్ వారికి సలామ్ చేశారంటూ.. ఆయన రాసిన క్షమాపణ పత్రాలంటూ మీడియా ముందు ఉంచడం కలకలం రేపింది. సావర్కర్ పై రాహుల్ చేసిన కామెంట్లపై బీజేపీ వాదులు భగ్గుమనగా.. శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రే సైతం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడం రాజకీయంగా కీలక పరిణామం. ఇదే విషయంపై కాంగ్రెస్ తో పొత్తును సైతం వదులుకోవడానికి ఠాక్రే రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

నవంబర్ 20న రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో ప్రవేశించనుంది. ఆ రాష్ట్రంలోనే ఆర్ఎస్ఎస్ మెయిన్ క్యాంపస్ ఉంది. సావర్కర్ పై రాహుల్ వ్యాఖ్యల అనంతరం.. మధ్యప్రదేశ్ లో బాంబు బెదిరింపు లేఖ బయటపడటంతో దీనికి దానికి ఏదైనా సంబంధం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇండోర్‌లోని ఖల్సా స్టేడియంలో భారత్ జోడో యాత్రికులు బస చేస్తే.. నగరంలో బాంబు పేలుళ్లు చేపడతామని ఆ లేఖలో వార్నింగ్ ఇచ్చారు. అయితే, రాహుల్ నే టార్గెట్ చేసుకున్నట్టు లేఖలో లేకున్నా.. ఎందుకైనా మంచిదని రాహుల్ గాంధీతో పాటు జోడో యాత్రకు భద్రత మరింత కట్టుదిట్టం చేయనున్నారు.

Related News

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

భారత్ భూభాగాన్ని ఆక్రమించామంటూ బాలెన్ షా సంచలనం.. ఈ సరిహద్దు లొల్లిలో చైనా రోల్ ఏంటి?

అమెజాన్, మెటా సంస్థలతో ఏపీ అగ్రిమెంట్లు.. బాబు తెస్తున్న కొత్త మార్కెటింగ్ వ్యూహంతో దళారుల్లో వణుకు!

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయాలు.. ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రజల కోసం ‘యూనిఫైడ్ స్మార్ట్ కార్డ్’!

టేబుల్ మీద చర్చలు.. సరిహద్దుల్లో దాడులు.. అమెరికా, ఇరాన్ మధ్య అసలేం జరుగుతోంది?

Big Stories

×