DMK Congress: కాంగ్రెస్ నమ్మకద్రోహం చేసింది. పార్లమెంటులో ఆ పార్టీతో కలిసి పనిచేయబోమని క్లియర్ కట్గా తేల్చేసింది డీఎంకే. ప్రతిపక్షంగా.. కేంద్రంతో ఒంటరిగానే పోరాడతామన్నారు ఆ పార్టీ నేత దయానిధి మారన్. తమిళనాడు ఎన్నికల తర్వాత.. రెండు పార్టీలకు చెడింది. కాంగ్రెస్తో కలిసేది లేదు.. ఇండి కూటమితో వచ్చేది లేదంటూ డీఎంకే లీడర్లు ఇస్తున్న స్టేట్మెంట్లు నేషనల్ లెవెల్లో హాట్ టాపిక్గా మారాయ్. మిగతా పార్టీలు కూడా డీఎంకే రూటులో నడిచే అవకాశం ఉందంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్కు ప్రాంతీయ పార్టీల మద్దతు లేకపోతే.. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయ్.
ఇది.. మళ్లీ ఎన్డీయేకే బెనిఫిట్ అవుతుందనే టాక్ ఉంది. ప్రాంతీయ పార్టీలను కలుపుకొని వెళ్లే పొలిటికల్ స్ట్రాటజీ, సీట్ల సర్దుబాటులో రాజీపడే తత్వం, కష్టకాలంలో ప్రాంతీయ పార్టీల నేతలకు అండగా ఉన్నామనే భరోసా కల్పించడంలో కాంగ్రెస్ ఫెయిలవుతోంది. ఈ తీరు మారకపోతే.. ఇండియా కూటమి విచ్ఛిన్నమయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. డీఎంకే విషయంలో కాంగ్రెస్ తీసుకున్న స్టాండ్.. ఇప్పుడు నేషనల్ లెవెల్ కూటమి ఐక్యతని ప్రశ్నార్థకం చేస్తోంది.