Telangana Liberation: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో.. తెలంగాణ విమోచన దినోత్సవ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కేంద్ర బలగాల కవాతు రిహార్సల్స్ చూశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా కళాకారుల ప్రదర్శనలు, ప్రత్యేక నృత్య రూపకాలు ఏర్పాటు చేశారు. వాటి రిహార్సల్స్ను కూడా పరిశీలించారు. ఈ ఏడాది వేడుకలకు ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్.. ముఖ్య అతిథులుగా హాజరవుతారని కిషన్ రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు రెండూ.. ఎంఐఎం మాట వినే.. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపడం లేదని ఆరోపించారు.
మరోవైపు.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలంటూ.. హైదరాబాద్ ప్రెస్క్లబ్లో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీ ఈటల రాజేందర్తో పాటు బండారు దత్తాత్రేయ, విద్యాసాగర్ రావు కూడా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం జరుపుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చాక కేసీఆర్ మాట తప్పారని ఈటల విమర్శించారు. బుజ్జగింపు రాజకీయాల వల్లే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపలేదని ఆరోపించారు.
Also read: ఆగా ఖాన్ ఫౌండేషన్కి సీఎం రేవంత్ రెడ్డి కీలక విజ్ఞప్తి.. సీఎం వ్యూహం అదేనా..?
మరోవైపు.. కాంగ్రెస్ ప్రభపుత్వం సెప్టెంబర్ 17ని.. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఎగురవేయనున్నారు. ఒకే రోజు.. మూడు పేర్లు.. మూడు వేదికలతో.. మరోసారి తెలంగాణలో సెప్టెంబర్ 17 రాజకీయ పోరుకు కేంద్రంగా మారింది. విమోచనమా? జాతీయ సమైక్యతా? ప్రజాపాలనా? ఏ పేరుతో పిలవాలన్నదే ఏటా రగిలే రాజకీయం.
Also Read: 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!