E-Paper
Advertisement

39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!

39 మంది భార్యలు, 94 మంది పిల్లలు.. ఎక్కడో కాదు మన ఇండియాలోనే!
Advertisement

World Largest Family: మిజోరంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన జియోనా చానా.. ఏకంగా 39 పెళ్లిళ్లు, అతిపెద్ద ఫ్యామిలీతో యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 181 మంది కుటుంబ సభ్యులతో ఒకే ఇంట్లో కలిసి జీవించి.. అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. 39 మంది భార్యలతో పాటు 94 మంది పిల్లలు, 14 మంది కోడళ్లు, 33 మంది మనవళ్లు, మనవరాళ్లు ఒక మునిమనవడు ఆయనకు ఉన్నారు.

ఎవరీ జియోనా చానా?

జియోనా చానా మిజోరంలో బహుభార్యత్వ విధానాన్ని పాటించే ఒక క్రైస్తవ తెగకు నాయకుడు. ‘చానా పాల్’ అని పిలిచే ఈ సమూహాన్ని ఆయన తండ్రి ఖుయాంగ్తుహా జూన్ 1942లో స్థాపించారు. బక్తావ్ంగ్ త్లాంగ్నుఅమ్ గ్రామం, దాని పరిసర ప్రాంతాలలో ఈ తెగకు చెందిన దాదాపు 2,000 మంది సభ్యులు నివసిస్తున్నారు. వీరంతా ఒకరికొకరు దగ్గరగా ఉంటూ స్వయం సమృద్ధి జీవన విధానాన్ని పాటిస్తారు.

17వ ఏట మెుదటి పెళ్లి..

Advertisement

జియోనా తన 17వ ఏట జతియాంగి అనే మహిళను తొలి పెళ్లి చేసుకున్నారు. ఆమె ఆయన కంటే మూడేళ్లు పెద్దది. ఆ తర్వాత జియోనా వరుసగా 39 మంది మహిళలను పెళ్లాడారు. నివేదికల ప్రకారం ఆయన చివరి పెళ్లి 2004లో జరిగింది. కాలక్రమేణా కుటుంబ పరిమాణంలో మార్పులు వచ్చినప్పటికీ ఆయన పేరు అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది.

100 గదుల భవనం

ఈ కుటుంబం అంతా ‘ఛువాన్ థార్ రన్’ అని పిలిచే నాలుగు అంతస్తుల భవనంలో నివసిస్తోంది. బక్తావ్ంగ్‌లో ఉన్న ఈ భవనంలో దాదాపు 100 గదులు ఉన్నాయి. అలాగే అతిథుల కోసం ‘ఖువాల్‌బుక్’ (గెస్ట్‌హౌస్) కూడా నిర్మించారు. జియోనా గ్రౌండ్ ఫ్లోర్‌లో డబుల్ బెడ్‌రూమ్‌లో ఉండేవారు. ఆయన భార్యలు వంతులవారీగా ఆయనతో సమయం గడిపేవారు. చిన్న వయస్సు ఉన్న భార్యలు ఆయన గదికి దగ్గరగా నివసించగా, పెద్ద వయస్కులు మొదటి అంతస్తులోని డార్మిటరీలలో ఉండేవారు.

రోజుకు 90 కిలోల బియ్యం

Advertisement

ఇంత పెద్ద కుటుంబానికి తగ్గట్లే నిత్యవసర సరుకులకు భారీ మెుత్తంలో ఖర్చు అవుతుంది. ఓ నివేదిక ప్రకారం ఈ కుటుంబం రోజుకు దాదాపు 200 పౌండ్ల (సుమారు 90 కిలోలు) బియ్యం, 130 పౌండ్ల కంటే ఎక్కువ బంగాళాదుంపలను వినియోగించేది. కుటుంబం కోసం సొంతంగా ఒక పాఠశాల సైతం ఉండేదట. అక్కడ పిల్లలకు మిజో, ఇంగ్లీష్, హిందీ భాషల్లో పాఠాలు బోధించేవారట.

గిన్నిస్ రికార్డు తిరస్కరణ

జియోనా చానాను ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్దగా పేర్కొన్నప్పటికీ ఆయనకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు దక్కలేదు. 2007లో గిన్నిస్ అధికారులు ఆయన్ను కలిసినప్పుడు ఫొటో దిగడానికి నిరాకరించారు. తనకు అనవసరమైన ప్రచారం ఇష్టం లేదని 2011లో ఆయన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయినప్పటికీ 2011లో వరల్డ్ రికార్డ్ అకాడమీ, ది వాల్ స్ట్రీట్ జర్నల్ ఈ కుటుంబాన్ని ‘అతిపెద్ద కుటుంబం’గా గుర్తించాయి. 2019లో లండన్ వరల్డ్ రికార్డ్స్ కూడా జియోనాను ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబ పెద్దగా పేర్కొంది.

పర్యాటక కేంద్రంగా మారిన గ్రామం

జియోనా చానా కుటుంబం కారణంగా బక్తావ్ంగ్ త్లాంగ్నుఅమ్ గ్రామానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. నాలుగు అంతస్తుల భవనాన్ని, వారి ప్రత్యేక జీవనశైలిని చూడటానికి ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు రావడం ప్రారంభించారు.

Also Read: ఈ రైలు ఎక్కితే ఆహారం ఉచితం.. జనరల్ నుండి AC వరకు.. వేడివేడి భోజనం!

జూన్ 2021లో జియోనా కన్నుమూత

మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న జియోనా చానా.. 2021 జూన్ 13న ఐజ్వాల్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన మరణం తర్వాత మిజోరం అప్పటి ముఖ్యమంత్రి జోరమ్‌థంగా నివాళులర్పిస్తూ రాష్ట్ర పర్యాటకరంగానికి ప్రత్యేకాకర్షణగా నిలిచిన ఒక గొప్ప వ్యక్తికి వీడ్కోలు పలుకుతున్నామని పేర్కొన్నారు.

Also Read: ఆళ్ల నాని మృతి పట్ల సీఎం చంద్రబాబు, జగన్, లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి!

Tags

Related News

ఈ రైలు ఎక్కితే ఆహారం ఉచితం.. జనరల్ నుండి AC వరకు.. వేడివేడి భోజనం!

14 బోగీలు.. 400 మంది ప్రయాణికులు.. భారత తొలి రైలు ప్రయాణం ఎలా సాగిందంటే!

దీపావళికి రైల్వే గుడ్ న్యూస్.. 100కు పైగా స్పెషల్ ట్రైన్లు!

భారత్‌కు రష్యా హైస్పీడ్ గిఫ్ట్.. వందే భారత్‌ ను తలదన్నే కొత్త రైలు వచ్చేస్తోంది!

ఖైరతాబాద్ తరహాలో.. దేశంలోనే పాపులర్ గణేశ్ మందిరాలు.. ఈ 6 పక్కా చూడాల్సిందే!

భూమిని కాపాడుతున్న సూపర్ పవర్స్.. మనుషులు కాదండోయ్.. ఈ 6 జీవులే రియల్ హీరోస్!

రైలు మీద తెగిపడ్డ ఓవర్‌ హెడ్ వైర్లు.. ఒక్కసారిగా పెద్ద శబ్దం.. భయంతో వణికిపోయిన ప్రయాణికులు!

Big Stories

Advertisement
×