Bengal Bypolls: మమతా బెనర్జీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఉప ఎన్నికలకు కౌంట్డౌన్ మొదలైన వేళ.. మమత వర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి.. రెజినగర్ బరి నుంచి తప్పుకున్నారు. తన నామినేషన్ విత్ డ్రా చేసుకున్నారు. అంతకుముందే.. మమత వర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి సంచితా ప్రధాన్.. నందిగ్రామ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఒక్కరోజు గ్యాప్లోనే.. మరో అభ్యర్థి కూడా వెనక్కి తగ్గడంతో.. బెంగాల్ రాజకీయం రసవత్తరంగా మారింది.
పశ్చిమ బెంగాల్లో.. వచ్చే అక్టోబర్ 6న నందిగ్రామ్, రెజినగర్ నియోజకవర్గాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఇంతలోనే.. మమత వర్గం నుంచి ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు విత్ డ్రా చేసుకోవడంతో.. దీదీ పార్టీ ఈ ఎన్నికల బరిలో నిలిచే అవకాశమే లేకుండా పోయింది. అయితే, నందిగ్రామ్ నుంచి తాము కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతిస్తామని మమత ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే.. ఓ కేసులో కాంగ్రెస్ అభ్యర్థి మిలాన్ ప్రధాన్ను బెంగాల్ పోలీసులు అరెస్ట్ చేయడం.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్గా మారింది.
తృణమూల్ కాంగ్రెస్ రెండుగా చీలడం, తమదే అసలైన పార్టీ అని ప్రకటించుకోవడంతో.. రెండు వర్గాల మధ్య వివాదం నడుస్తోంది. ఈ క్రమంలోనే.. ఉప ఎన్నికల్లో పార్టీ పేరు, ఎన్నికల గుర్తు పూలు గడ్డిపై ఎన్నికల సంఘం తాత్కాలికంగా నిషేధం విధించింది. రెండు వర్గాలకు వేర్వేరు పేర్లు, గుర్తులను కేటాయించింది. దీనిని సవాల్ చేస్తూ.. మమతా బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లో.. ఈసీతో పాటు బెంగాల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడైన రితబ్రతా బెనర్జీని ప్రతివాదిగా చేర్చారు. తన పార్టీ అసలు గుర్తింపు అయిన.. పూలు గడ్డి గుర్తుని తిరిగి పొందేవరకు పోరాడతానని చెప్పారు.
Also read: అదనపు కట్నం కోసం కానిస్టేబుల్ వేధింపులు.. ఆత్మహత్య చేసుకున్న యువతి!