E-Paper
Advertisement

NexGen Energia EV : చీప్ గురూ.. రూ. 37,000 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!

NexGen Energia EV : చీప్  గురూ.. రూ. 37,000 కే ఎలక్ట్రిక్‌ స్కూటర్‌!
NexGen Energia EV
NexGen Energia EV

NexGen Energia EV : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రేజీగా పెరిగింది. ఇప్పటికే కొత్తకొత్త కంపెనీలు ఈవీ మార్కెట్‌లోకి రంగ ప్రవేశం చేశాయి. సరికొత్త ఫీచర్లు, మంచి ఆఫర్డ్‌బుల్ ప్రైజ్‌తో ఈవీ వెహికల్స్‌ను అందిస్తున్నాయి. దీంతో ఎక్కువ మంది ఈవీలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరి ముఖ్యంగా ఈవీ స్కూటర్ల వాడకం సిటీల్లో ఎక్కువగా ఉంది. వీటి మెయింటి‌నెస్ చాలా తక్కువ. పైగా ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండదు. ప్రభుత్వాలు కూడా ఈ కంపెనీలకు ప్రోత్సాహకాలు అందిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో Nexgen Energia అనే సంస్థ అత్యంత సరసమైన ధరలో కొత్త ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ లాంచ్ చేసింది. బాలీవుడ్‌ నటుడు సునీల్ శెట్టి ఈ ఈవీని విడుదల చేశారు. దీని ధర రూ. 36,990గా ఉంది. దీని పూర్తి వివరాలు తెలుసుకోండి.

Also Read : ఫోక్స్ వ్యాగాన్ కార్లపై అదిరిపోయే ఆఫర్.. రూ. లక్షల్లో డిస్కౌంట్లు!

నెక్స్‌జెన్ ఎనర్జియా ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ నోయిడా కేంద్రంగా పనిచేస్తుంది. కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విజయవంతంగా మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. కేవలం రూ. 36,990 ధరలో విడుదల చేయడంతో ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మధ్యతరగతి ప్రజలు తక్కువ ధరకు ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలు చేసేలా ఈ స్కూటర్ లాంచ్ చేసినట్లు కంపెనీ ఛైర్మన్ పీయూష్‌ ద్వివేది తెలిపారు.

అంతేకాకుండా పొల్యూషన్ లేకుండా ప్రతి భారతీయ పౌరుడికి ఎలక్ట్రిక్ వాహనాలు అందించడమే తమ లక్షమని అన్నారు. అలానే ఈ కొత్త స్కూటర్‌ విడుదలతో ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 500 కోట్ల లావాదేవీలు జరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 500 మంది డీలర్లు నియమించాలని భావిస్తున్నట్లు వెల్లడించారు.

Also Read : పల్సర్ నుంచి మరో కొత్త బైక్.. ఏప్రిల్ 10న లాంచ్ కానున్న N250 మోడల్

దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మందికి ఉపాధి లభిస్తోందని పీయూష్‌ ద్వివేది అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల రంగం భారతదేశ భవిష్యత్తుగా రూపుదిద్దుకుంటోందని వెల్లడించారు. ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ సెగ్మెంట్‌ను అభివృద్ధి చేస్తున్నామని.. త్వరలో ఎలక్ట్రిక్ కార్లను కూడా మార్కెట్‌లోకి తీసుకొస్తామని తెలిపారు. ఎలక్ట్రిక్ కార్లు విజయవంతమైతే వాటిని రూ. 5 లక్షల కంటే తక్కువ ధరలో విక్రయిస్తామని ద్వివేది వెల్లడించారు.

Related News

ప్రధాని నరేంద్రమోదీ ‘బంగారం’ మాటలు.. ఆపై గృహాలు, దేవాలయాల వంతు

ఆయిల్ తర్వాత గ్యాస్ వంతు మొదలు.. మరోసారి కమర్షియల్‌గా బాదుడు.. సిలిండర్‌కు రూ.42

బాలికలకు వరం… సుకన్య సమృద్ధి యోజనలో ఇలా పెట్టుబడి పెడితే మీ కూతురుకి 50 లక్షలు పక్కా

నెలలో ఏ తేదీన సిప్ వేస్తే ఎక్కువ లాభం… 30 ఏళ్ల అధ్యయనం చెప్పిన షాకింగ్ నిజం

క్రెడిట్ కార్డు వాడుతున్నారా? ఈ 5 పొరపాట్లు చేస్తే భారీ ఆర్థిక నష్టం తప్పదు

డాలర్లు అమ్మడం ద్వారా ఆర్‌బీఐకి లక్షల కోట్ల లాభం… రూపాయి విలువను కాపాడే వ్యూహం వెనుక ఉన్న అసలు కథ ఇదే

దేశంలో ఇళ్ల ధరలకు రెక్కలు.. 24 శాతం వరకు పెరుగుదల నమోదు, ఇక హైదరాబాద్‌ మాటేంటి?

బంగారం-వెండి ధరలు తగ్గుముఖం.. కొనుగోలు ఇదే సరైన సమయం, మార్కెట్లో ధరల మాటేంటి?

Big Stories

×