E-Paper
Advertisement

Airtel Hikes Tariffs: జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు!

Airtel Hikes Tariffs: జియో బాటలో ఎయిర్‌టెల్.. భారీగా పెరిగిన రీఛార్జ్ ధరలు!
Advertisement

Airtel Hikes Recharge Plans: ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ యూజర్లకు షాక్ ఇచ్చింది. రీఛార్జ్ ధరలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిర్‌టెల్ టారిఫ్స్ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ ధరలు జులై 3 నుంచి అమలులోకి వస్తాయని భారతీ ఎయిర్‌టెల్ పేర్కొంది.

దేశంలోని అన్ని సర్కిళ్లకు వర్తిస్తాయని స్పష్టం చేసింది. అయితే, రిలయన్స్ జియో సంస్థ.. తమ టారీఫ్‌లను పెంచుతున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే ఎయిర్‌టెల్ కూడా ధరలను పెంచడం గమనార్హం.

Advertisement

అపరిమిత వాయిస్ ప్లాన్‌లలో ఎయిర్‌టెల్ టారిఫ్‌ను రూ.179 నుంచి రూ.199కి పెంచింది. అదే విధంగా రూ.299 నుంచి రూ.349, రూ. 399 నుంచి రూ. 449 వరకు పెరిగాయి. అలాగే రూ.455 నుంచి రూ.599 వరకు పెంచగా.. రూ.1,799 నుంచి రూ.1,999 వరకు పెంచుతున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

రిలయన్స్ జియో మొబైల్ 12 నుంచి 27 శాతం వరకు ప్రకటించగా.. ఎయిర్‌టెల్ మాత్రం రీఛార్జ్ ధరలు 10 నుంచి 21 శాతం పెరిగాయి. అయితే రెండున్నరేళ్ల తర్వాత మళ్లీ టెలికాం సంస్థలు కస్టమర్లపై భారం మోపాయి.

Advertisement

Also Read: భారీగా పెరిగిన జియో రీచార్జ్ ధరలు..అంబానీపై ట్రోల్స్!

కాగా, దేశంలో టెల్కోలకు ఆర్థికంగా ఆరోగ్యకరమైన వ్యాపార నమూనాలను ప్రారంభించేందుకు ప్రతీ కస్టమర్‌పై ఆవరేజ్ రెవెన్యూ ఫర్ యూజర్(ఏఆర్పీయూ) రూ.300 కంటే ఎక్కువగా ఉండాలని భారతీ ఎయిర్‌టెల్ మీడియా ప్రకటనలో తెలిపింది.

గతంలో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియాలు పెంచాయి. ఈ సంస్థలు 2021 డిసెంబర్‌లో మొబైల్ సర్వీస్ రేట్లను పెంచాయి. అంతకుముందు 2019 లో టెలికాం సంస్థలు రేట్లను 20 నుంచి 40 శాతం వరకు పెంచాయి. అలాగే 2021లో 20 శాతం వరకు పెంచాయి. అయితే, తాము రీఛార్జ్ ధరలు పెంచినా.. కస్టమర్లపై ఎక్కువ భారదం పడకుండా చూసుకుంటామని ఎయిర్‌టెల్ సంస్థ చెప్పింది.

Tags

Related News

ఆ 3 సెకన్ల వెనుక కోట్ల వ్యాపారం.. Mutual Funds యాడ్స్ స్పీడ్ వెనుక ఉన్న మైండ్ గేమ్ ఇదే!

కూతురు ఉందా? రూపాయి ఖర్చు లేకుండా ఆమె పెళ్లి, చదువు బాధ్యతలు తీరిపోయే సూపర్ స్కీమ్ ఇదే!

ధర ఏమో ఆకాశానికి.. సైజు ఏమో చిన్నగా.. భాగ్యనగరంలో గుడ్డు రేట్ల ఘాటు!

ప్రైవేట్ జాబ్ చేస్తున్నారా? రిటైర్మెంట్ తర్వాత కూడా రాజాలా బతకాలంటే ఇప్పుడే ఇలా చేయండి!

సైబర్ వలలో కార్పొరేట్ కంపెనీలు.. అలజడి రేపుతోన్న ‘బాస్ స్కామ్’!

ఆర్బీఐ సంకేతాలు.. వచ్చే ఏడాది నుంచి మార్కెట్లోకి ప్లాస్టిక్ నోట్లు, మళ్లీ నోట్ల రద్దు తప్పదా?

పసిడి ప్రియులకు పండగే.. నేడు మళ్లీ దిగివచ్చిన ధరలు.. ఎంత తగ్గిందంటే?

బంగారం ప్రియులకు గుడ్ న్యూస్.. నిన్న పెరిగిన పసిడి ధరలకు నేడు బ్రేక్.. తాజా రేట్లు ఇవే!

Big Stories

Advertisement
×