Airtel Price Hike: టెలికాం కంపెనీలు వరుసగా కస్టమర్లకు షాక్ ఇస్తున్నాయి. రీఛార్జ్ ప్లాన్ల ధరలను క్రమంగా పెంచుతున్నాయి. తాజాగా భారతీ ఎయిర్టెల్ ప్రీపెయిడ్ ప్లాన్ ధరను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఎయిర్టెల్ 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లో కీలక మార్పులు చేసింది. అలాగే కొన్ని చౌకైన ప్లాన్లను నిలిపివేసి, ఉన్న వాటి ధరలను పెంచింది. తాజా నివేదిక ప్రకారం ఎయిర్టెల్ రూ.799 ప్లాన్ను నిలిపివేసింది. అంతేకాకుండా రూ.859 ప్లాన్ ధరను రూ.899కి పెంచింది.
గతంలో రూ. 859 గా 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ ధరను రూ. 899కి పెంచింది. 40 రూపాయల భారం వినియోగదారులపై పడనుంది. గతంలో రూ. 700 నుంచి రూ. 800 సెగ్మెంట్లో ఎయిర్టెల్ రూ. 799 , రూ. 859 ప్రీపెయిడ్ ప్లాన్లను ఆఫర్ చేసేది. కానీ తాజాగా, 84 రోజుల పాటు 1.5 GB డేటా కావాలనుకునే వారు కచ్చితంగా రూ. 899 ఖర్చు చేయక తప్పదు.
ట్రూలీ అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్ లో కస్టమర్లకు లభించే సౌకర్యాలు
అయితే తాజాగా ఈ ధరల పెంపు ఒక ప్లాన్కు మాత్రమే పరిమితం అని ఎయిర్ టెల్ తెలిపింది. కంపెనీ ప్రస్తుతం పెద్ద ఎత్తున టారిఫ్లను పెంచే ఆలోచనలో లేదని, కానీ క్రమంగా టారిఫ్ లు పెంచే ఆలోచనలో ఉందని సమాచారం. కస్టమర్లను 5G సేవలకు మళ్లించి, ఆదాయాన్ని పెంచుకోవడానికే ఎయిర్టెల్ 1.5GB ప్లాన్లపై డిస్కౌంట్లను తగ్గిస్తోందని ఎక్స్ ఫర్ట్స్ భావిస్తున్నారు.
ప్రీపెయిడ్ ప్లాన్ ధర పెంపు విధానాన్ని బట్టి, అన్ని ప్రీపెయిడ్ ప్లాన్లలో పెద్దగా ధరల పెంపు ఉండదని ఎక్స్ ఫర్ట్స్ అంటున్నారు. టెలికాం కంపెనీలు సాధారణంగా భారీ టారిఫ్ మార్పులను ఒకేసారి ప్రకటిస్తాయి. అందువల్ల, తాజా పెంపు అధిక వినియోగం ఉన్న ప్లాన్లను మెరుగ్గా నిర్వహించడానికే అంటున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో ఎయిర్ టెల్ గ్లోబల్ ఇంటర్నేషనల్ రోమింగ్ ప్యాక్ ధరను రూ.4,000 నుంచి రూ.4,999కి పెంచింది.
Also Read: ఎయిర్టెల్ ధమాకా ప్లాన్స్.. ఫ్రీ హాట్స్టార్, నాన్ స్టాప్ 5G డేటా.. ఐపీఎల్ లవర్స్కు మాస్ జాతరే!