E-Paper
Advertisement

BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం

BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం
Advertisement

BJP Criticism: రాష్ట్రంలో పొలిటికల్ టూరిజం నడుస్తోందని బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ అనుకునే సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఇద్దరూ తోడుదొంగలుగా మారారని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోరాటం చేయడానికి బయటకు రారని, కానీ ఈరోజు ఒక నేతను తమ పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ బయటికి రావడం దురదృష్టకరమన్నారు.

పార్టీ లబ్ధి కోసమే కేసీఆర్ బయటికి వచ్చి ఒక నేతను ఆహ్వానిస్తున్నారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. 26 నెలల నుంచి అసెంబ్లీకి రాని కేసీఆర్ రూ.5 కోట్ల వరకు జీత భత్యాలు తీసుకున్నారన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయని కేసీఆర్ కి రూ.5 కోట్లు అవసరమా? అని సుభాష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సమీక్షలకే పరిమితమైందని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి చేప్పిన మాటలేమయ్యాయని నిలదీశారు.

Advertisement

Also Read: కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగుల కష్టాలే పట్టించుకోవడంలేదని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. అలాంటిది ఇక ప్రజలకేం న్యాయం చేస్తారని విమర్శించారు. కేసీఆర్ రూ.4 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, తామెందుకు సంపాదించుకోకూడదనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. మహిళలకు వచ్చే హక్కును ఇండియా కూటమి అడ్డుకుందని, మహిళలకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తామని సుభాష్ తెలిపారు.

Advertisement

Also Read: కేసీఆర్ పర్యటనలో డ్రోన్ కలకలం.. భద్రతా లోపమా? ప్రైవేటు వ్యక్తుల పనా?

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×