E-Paper
Advertisement

BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం

BJP Criticism: రేవంత్, కేసీఆర్ ఒక్కటే.. తోడుదొంగలుగా మారారు.. బీజేపీ నేత సంచలనం
Advertisement

BJP Criticism: రాష్ట్రంలో పొలిటికల్ టూరిజం నడుస్తోందని బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ ఎన్వీ సుభాష్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ అనుకునే సభలు నిర్వహిస్తున్నారన్నారు. ఇద్దరూ తోడుదొంగలుగా మారారని విమర్శించారు. ప్రజల పక్షాన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ పోరాటం చేయడానికి బయటకు రారని, కానీ ఈరోజు ఒక నేతను తమ పార్టీలో చేర్చుకోవడానికి మాత్రం కేసీఆర్ బయటికి రావడం దురదృష్టకరమన్నారు.

పార్టీ లబ్ధి కోసమే కేసీఆర్ బయటికి వచ్చి ఒక నేతను ఆహ్వానిస్తున్నారని ఎన్వీ సుభాష్ విమర్శించారు. 26 నెలల నుంచి అసెంబ్లీకి రాని కేసీఆర్ రూ.5 కోట్ల వరకు జీత భత్యాలు తీసుకున్నారన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం చేయని కేసీఆర్ కి రూ.5 కోట్లు అవసరమా? అని సుభాష్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరంపై సమీక్షలకే పరిమితమైందని చురకలంటించారు. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నపుడు రేవంత్ రెడ్డి చేప్పిన మాటలేమయ్యాయని నిలదీశారు.

Advertisement

Also Read: కాళేశ్వరం కేసీఆర్ చేసిన భారీ పాపం.. అందుకోసమే హరీష్ రావు ఢిల్లీకి..! సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం.. సచివాలయ ఉద్యోగుల కష్టాలే పట్టించుకోవడంలేదని ఎన్వీ సుభాష్ ఆరోపించారు. అలాంటిది ఇక ప్రజలకేం న్యాయం చేస్తారని విమర్శించారు. కేసీఆర్ రూ.4 లక్షల కోట్లు సంపాదించుకున్నారని, తామెందుకు సంపాదించుకోకూడదనే ఆలోచనలో కాంగ్రెస్ నేతలు ఉన్నారని మండిపడ్డారు. మహిళలకు వచ్చే హక్కును ఇండియా కూటమి అడ్డుకుందని, మహిళలకు కాంగ్రెస్ చేసిన అన్యాయంపై ప్రజలకు వివరిస్తామని సుభాష్ తెలిపారు.

Advertisement

Also Read: కేసీఆర్ పర్యటనలో డ్రోన్ కలకలం.. భద్రతా లోపమా? ప్రైవేటు వ్యక్తుల పనా?

Related News

Medchal: నడి రోడ్డు పై వరి నాట్లు.. బీఆర్ఎస్ నాయకుల వినూత్న నిరసన..!

ఎండిపోతున్న ప్రాజెక్టులు.. హైదరాబాద్‌కు తగ్గిన నీటి సరఫరా.. రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవా?

ట్రైనీ ఐపీఎస్‌ ఉదయ్‌ ఆత్మహత్యాయత్నం.. వెంటనే ఆసుపత్రికి తరలింపు

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

Big Stories

Advertisement
×