BigTV English
Advertisement

Mukesh Ambani : అంబానీ తర్వాతే ఎవరైనా.. గిఫ్ట్స్ ఇవ్వాలంటే!

Mukesh Ambani : అంబానీ తర్వాతే ఎవరైనా.. గిఫ్ట్స్ ఇవ్వాలంటే!

Mukesh Ambani


Mukesh Ambani : అపర కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు పలు సందర్భాల్లో ఖరీదైన కానుకలు ఇచ్చిపుచ్చుకుంటుంటారు. ఆ కానుకలకు సంబంధించి ఎన్నో వార్తలు మీరు వీనే ఉంటారు. అయితే కొన్ని నెలల క్రితమే ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ- రాధికా మర్చంట్ నిశ్చితార్థం సందర్భంగా వారికి అందించిన బహుమతులు చర్యనీయాంశంగా మారాయి.

ముకేష్ అంబానీ కొన్ని ప్రత్యేక సందర్బాల్లో తమ కుటుంబ సభ్యులకు ఖరీదైన గిఫ్ట్స్ ఇస్తుంటారు. వాటి విలువ కోట్లలోనే ఉంటుంది. వాటి గురించి విన్నవారు, తెలిసినవారు ముకేశ్ అంబానీ తర్వాతే గిఫ్ట్‌లు ఇవ్వాలంటే ఎవరైనా అని చెబుతుంటారు.


READ MORE : వరల్డ్ రిచెస్ట్ బిలియనీర్ లిస్ట్ నుంచి మస్క్ అవుట్.. ప్రపంచ కుబేరుడిగా అమెజాన్ అధినేత

అలానే కొన్ని రోజుల క్రితం అనంత్ అంబానీ- రాధికా నిశ్చితార్థం సందర్భంగా వధూవరులిద్దరికీ పలు బహుమతులు అందించారు ముకేష్ అంబానీ. తన రెండో కొడుకు అనంత్ అంబానీకి నిశ్చితార్థం వేడుక రోజున ఏకంగా రూ.4.5 కోట్లు విలువ చేసే బెంట్లీ కాంటినెంటల్ జీటీసీ స్పీడ్ కారును గిఫ్ట్ ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు.

అంతేకాకుండా తనకు కాబోయే కోడలు రాధికా మర్చంట్‌కి ఖరీదైన వెండి గణపతి విగ్రహం, కుండలు సహా పలు నగలు కానుకగా అందించారట. అలాగే నీతా అంబానీ తన సొంత డైమండ్ నక్లెస్ సైతం రాధికా మర్చంట్ కి అందించినట్లు ఇటీవలే వార్తలు వచ్చాయి.

అదేవిధంగా అకాశ్ అంబానీ సైతం తన సోదురుడు అనంత్ అంబానీకి వజ్రాలతో రూపొందించిన పాంతర్ బ్రూచ్ జువెలరీని గిఫ్ట్‌గా అందించారు. దాని విలువ సుమారు రూ.1.3 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ముకేశ్ అంబానీ 2007లోనే తన భార్య నీతా అంబానీ పుట్టిన రోజు సందర్భంగా ఏకంగా ఆమెకు రూ.240 కోట్లు విలువ చేసే ప్రైవేట్ జెట్‌ను గిఫ్గ్‌గా ఇచ్చారు. గతేడాది దీపావళి గిఫ్ట్‌గా నీతా అంబానీకి రోల్స్ రాయిస్ కుల్లినన్ బ్లాక్ బ్యాడ్జ్ కారును సైతం ఇచ్చారు. దాని విలువ రూ.10 కోట్లు ఉంటుంది.

READ MORE : యాపిల్ సంస్థకు రూ.16,500 కోట్ల ఫైన్.. ఎందుకంటే!

ఆకాశ్ అంబానీ, శ్లోకా మెహతా వివాహం 2019లో జరిగింది. ఈ సందర్భంగా పెద్ద కోడలికి రూ.450 కోట్లకుపైగా విలువైన నెక్లెస్ కానుకగా అందించారు. తన చిన్న కుమారుడు అనంత్ అంబానీ కోసం 2022లో రూ.640 కోట్లు ఖర్చు చేసి దుబాయిలో లగ్జరీ విల్లాను కొనుగోలు చేసి బహుమతిగా ఇచ్చారు.

అంతేకాకుండా ముకేశ్ అంబానీ తన వద్ద నమ్మకంగా పని చేస్తోన్న ఉద్యోగి మనోజ్ మోదీకి ఓ ఇంటిని కానుకగా అందించారు. ఆ భవనం 22 అంతస్థుల్లో ఉంటుంది. భవనం విలువ రూ.1500 కోట్లు ఉంటుందట.

Tags

Related News

JioMart Winter Offer: జియోమార్ట్‌ భారీ వింటర్‌ ఆఫర్లు.. బియ్యం, సబ్బులు, మసాలాలు అన్నీ సగం ధరకే..

Luxury Mattresses: అమెజాన్‌లో లగ్జరీ మెట్రెస్‌పై భారీ తగ్గింపు.. ఈ ఆఫర్ మిస్ అవ్వకండి..

DMart Offers: నవంబర్ లో డిమార్ట్ క్రేజీ ఆఫర్లు, ఆ వస్తువులపై ఏకంగా 80% తగ్గింపు!

Gold Rate: గుడ్ న్యూస్.. నేడు స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు..

JioMart Offers: జియో మార్ట్‌ ఆఫర్లు రేపటితో లాస్ట్.. ఫ్రీ హోమ్ డెలివరీతో గ్రాసరీ వెంటనే కొనేయండి

Earbuds At Rs 749: ఫ్లిప్‌కార్ట్‌లో మాస్ ఆఫర్.. రూ.749లకే అద్భుతమైన బ్లూటూత్ ఇయర్‌బడ్స్

Amazon November 2025 Offers: రూ.25వేలలోపే డబుల్‌ డోర్‌ ఫ్రిజ్‌ .. ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ కూడా ఉంది బ్రో..

Suzuki Hayabusa 2025: లాంగ్ జర్నీకి నో టెన్షన్.. హై స్పీడ్‌తో దూసుకువస్తోన్న సుజుకి హయబూసా బైక్..

Big Stories

×